సహకారం లేదాయె!
నామమాత్ర సేవలకే పరిమితమైన సహకార సంఘాలను పునరుత్తేజితం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సొసైటీలే పెట్రో బంకులు నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. అయితే పెట్రో బంకుల ఏర్పాటు మూడడుగులు ముందుకేస్తే.. ఆరడుగులు వెనక్కి
తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్టుడే: నామమాత్ర సేవలకే పరిమితమైన సహకార సంఘాలను పునరుత్తేజితం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సొసైటీలే పెట్రో బంకులు నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. అయితే పెట్రో బంకుల ఏర్పాటు మూడడుగులు ముందుకేస్తే.. ఆరడుగులు వెనక్కి తోస్తున్నారు. గతేడాది జులైలోనే పెట్రో బంకులు మంజూరైనా ఇప్పటివరకు నిరభ్యంతర పత్రాల దశ దాటకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వ రంగం నుంచి పనిచేస్తున్న సొసైటీలకే ఎన్ఓసీల మంజూరులో వివిధ శాఖల అధికారులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా సహకార సంఘాల సీఈఓలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోతున్నారు. వ్యవసాయ రుణాల లభ్యతకు పునాది అయిన సహకార సంఘాలను పరపతేతర సేవలతో ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది.
ఎనిమిది బంకులు మంజూరు
జిల్లాలో సహకార సొసైటీలు 120 వరకు ఉన్నాయి. ఇందులో 105 సొసైటీలు సహకార బ్యాంకుకు అనుబంధంగా నడుస్తున్నాయి. అందులో కూడేరు, యల్లనూరు, పెడబల్లి, ముదిగుబ్బ, కణేకల్లు, రొద్దం, నార్పల, ఆమిద్యాల సొసైటీలకు పెట్రో బంకులు హెచ్పీసీఎల్ సంస్థ మంజూరు చేసింది. అవసరమైన స్థలం, నిర్వహణ సామర్థ్యం ఉన్న వాటికే కేటాయించారు. పెట్టుబడి ఖర్చులన్నీ హెచ్పీసీఎల్ భరిస్తుంది. పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లకు మాత్రమే సొసైటీలు ఖర్చు చేయాలి. అమ్మకం ద్వారా వచ్చిన లాభాలు సొసైటీ ఖాతాకు జమ చేయాలి. దీనివల్ల సొసైటీలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు నాణ్యమైన సేవలు ప్రజలకు అందించడానికి అవకాశం దక్కుతుంది. ఆశయం మంచిదైనా ఏర్పాటులో మాత్రం జాప్యం జరుగుతోంది.
ఎన్ఓసీలదే అసలు సమస్య
పెట్రో బంకుల ఏర్పాటుకు పంచాయతీ, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, రహదారి శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు మంజూరు జారీ చేయాలి. ఈ పత్రాలు జారీ అయిన తర్వాత హెచ్పీసీఎల్ అధికారులు పనులు ప్రారంభిస్తారు. ఆరు నెలలు దాటినా ఒక్క అడుగు పడలేదు. దీనిపై ఏడీసీసీ బ్యాంకు సీఈవో రాంప్రసాద్ మాట్లాడుతూ పెట్రోల్ బంకుల ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభమయ్యేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఎన్ఓసీల జారీ పూర్తయిన వెంటనే సంస్థ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్