logo

యువకుడి బలవన్మరణం

సివిల్స్‌ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధిస్తానా లేదా అనే బెంగతో భరత్‌కుమార్‌(23) అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల మేరకు.. మడకశిర మండలంలోని ఆర్‌.అనంతపురం గ్రామానికి చెందిన ఉగ్రప్ప కుమారుడు భరత్‌కుమార్‌

Published : 26 May 2022 03:53 IST


భరత్‌కుమార్‌ (పాతచిత్రం)

మడకశిర, న్యూస్‌టుడే: సివిల్స్‌ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధిస్తానా లేదా అనే బెంగతో భరత్‌కుమార్‌(23) అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల మేరకు.. మడకశిర మండలంలోని ఆర్‌.అనంతపురం గ్రామానికి చెందిన ఉగ్రప్ప కుమారుడు భరత్‌కుమార్‌ హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ పూర్తి చేసుకుని కొన్ని రోజుల కిందట ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. కుమారుడు ఐఏఎస్‌ అవుతాడని కలలు కన్న తల్లిదండ్రులు మృతదేహంపై పడి రోధించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని