అమ్మఒడి.. చిక్కుముడి!
అనంతపురం విద్య, గార్లదిన్నె గ్రామీణం, న్యూస్టుడే: ‘తల్లిదండ్రులూ పిల్లలను బడికి పంపండి.. వారిని చదివించే బాధ్యత మాది. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డను బడికి పంపలేని దుస్థితి రాకూడదు.
అర్హులైనా సొమ్ము అందలేదు
పేదలపై చదువుల భారం
అనంతపురం విద్య, గార్లదిన్నె గ్రామీణం, న్యూస్టుడే: ‘తల్లిదండ్రులూ పిల్లలను బడికి పంపండి.. వారిని చదివించే బాధ్యత మాది. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డను బడికి పంపలేని దుస్థితి రాకూడదు. అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందజేస్తాం’ ఇదీ పలు సందర్భాల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాటలు నమ్మి పేదలు కొందరు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. అప్పులు చేసి ఫీజులు చెల్లించారు. ప్రస్తుతం సొమ్ము అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. చిన్నపాటి కారణాలు, సచివాలయ సిబ్బంది చేసిన పొరపాట్లతో అనేక మందికి అమ్మఒడి సొమ్ము అందకుండా పోతోంది.
ఇప్పుడెందుకు ఇవ్వలేదు
పథకం ప్రారంభం నుంచి ఏటా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. కొత్త నిబంధనలతో కోతలే కాదు, అర్హులను పథకానికి దూరం చేస్తున్నారు. సొంతభవనాలు, కార్లు, ఆస్తిపన్ను, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్న కిందిస్థాయి ఉద్యోగులను పథకం నుంచి తొలగించారనుకుంటే ఓ అర్థం ఉంది. నిరుపేదలను సైతం పథకం నుంచి దూరం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో పథకానికి దూరమయ్యారు. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ, ఇళ్లులేకపోయినా ఉన్నట్లు చూపడం, విద్యుత్తు బిల్లులు, ఇంటిపన్నులు ఎక్కువగా ఉన్నట్లు నమోదు చేయడంతో అర్హులకు నిధులు అందకుండా పోయాయి. గత రెండేళ్లు సొమ్ము తీసుకున్న పేద తల్లులు చాలామంది ఈసారి అందుకోలేకపోయారు. రెండేళ్లు సొమ్ము ఇచ్చి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రతి సచివాలయంలో జాబితా
ప్రతి సచివాలయం పరిధిలోనూ అమ్మఒడి కోల్పోయిన బాధితులు ఉన్నారు. గత రెండేళ్లు సొమ్ము అందుకున్న వారిలో అనేక మంది ఈ ఏడాది పథకానికి దూరమయ్యారు. లబ్ధిదారుల జాబితా వార్డు/గ్రామ సచివాలయాలకు పంపించారు. అనర్హుల జాబితానూ ప్రదర్శించారు. వాటికి కారణాలు కూడా తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలోనూ 10 నుంచి 50 మంది వరకూ అనర్హులుగా తేల్చారు. అనర్హుల జాబితాలో చాలామంది అర్హులే ఉన్నారు.
తల్లి మల్లికతో విద్యార్థి జశ్వంత్
ఈమె పేరు మల్లిక. కుమారుడు జశ్వంత్ ఐదో తరగతి పూర్తి చేశాడు. రెండేళ్లు అమ్మఒడి నగదు ఖాతాలో జమైంది. ఈ ఏడాది అందలేదు. సచివాలయంలో అడిగితే మీ ఖాతాకు ఎన్పీసీఐ నమోదు కాలేదంటున్నారు. బ్యాంకులో విచారిస్తే.. మరో బ్యాంకు ఖాతాకు నమోదైందని చెప్పారు. వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సాయం వస్తే పిల్లల చదువులకు ఉపయోగపడుతుందని ఆశించారు. న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.
అనంతలోని సాయినగర్కు చెందిన ఈమె పేరు అంజినమ్మ. వీధుల్లో తిరుగుతూ పూలవ్యాపారం చేస్తుంది. అమ్మఒడి సొమ్ము వస్తుందన్న ధీమాతో కుమారుడు జశ్వంత్సాయిని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. 3వ తరగతి పూర్తయింది. గతేడాది అమ్మఒడి పథకం కింద రూ.14 వేలు అందాయి. ఈ సంవత్సరం అనర్హురాలని పేర్కొన్నారు. ఆమె ఆధార్కార్డు నంబరును గతంలో అద్దెకుంటున్న ఇంటికి అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె లేదు. ఆ ఇంటికి, ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా అనర్హురాలిగా ప్రకటించారు. వార్డు సచివాలయంలో నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అనంత నగరానికి చెందిన ఈమె పేరు భారతి గృహిణి. భర్త నాగరాజు హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. వారికి ముగ్గురు సంతానం. పెద్దకుమార్తె గిల్డాఫ్సర్వీసు పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. 2019, 2020లో అమ్మఒడి పథకం కింద సొమ్ము అందుకుంది. ప్రస్తుతం అనర్హురాలని చెబుతున్నారు. వీరు నాలుగు పోర్షన్ల భవనంలోని ఓ పోర్షనులో అద్దెకున్నారు. ఇంటి పన్ను ఆమె భర్త పేరుమీదుగా రావడంతో పథకానికి అనర్హులుగా తేల్చారు. ఈ విషయంపై నెలరోజులుగా సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకొనేవారులేరని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
రూ.10,500 కోత
నాకు ఇద్దరు కుమారులు. ఓ కుమారుడు విజయవాడలో ఇంటర్ చదువుతుండగా.. మరొకరు కొనకొండ్లలోని జ్యోతిరావు ఫులే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తొమ్మిదో తరగతి చదివే కుమారుడికి అమ్మఒడి పథకం ద్వారా సొమ్ము అందాల్సి ఉంది. అయితే ఎస్సీ ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ పేరుతో రూ.10,500 కోత పెట్టారు. రూ.3,500 ఇస్తున్నట్లు జాబితాలో చూపించారు.
- ఆదిలక్ష్మి, దర్గాహొన్నూరు, బొమ్మనహాళ్ మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు