logo

గొలుసు దొంగతనానికి యత్నించి..

ఓ దొంగ.. మహిళ మెడలోంచి గొలుసును తెంపుకొనేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో బ్లేడుతో కాట్లు వేసి పరారయ్యాడు.

Published : 02 Dec 2022 06:08 IST

మహిళపై బ్లేడుతో దాడి

బాధితురాలు వరలక్ష్మి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ దొంగ.. మహిళ మెడలోంచి గొలుసును తెంపుకొనేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో బ్లేడుతో కాట్లు వేసి పరారయ్యాడు. ఈ ఘటన నగరంలోని బళ్లారి బైపాస్‌ సమీపంలో గురువారం జరిగింది. బళ్లారి బైపాస్‌కు సమీపంలోని సత్యదేవనగర్‌లో ఏలూరు వరలక్ష్మి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి దుకాణం వద్దకు వచ్చి కూల్‌డ్రింక్‌ ఇవ్వమని ఆమెను కోరాడు. ఆమె దుకాణం లోపల ఫ్రిజ్‌లోని కూల్‌డ్రింక్‌ తీసుకురావడానికి వెనక్కి తిరిగారు. ఉన్నఫళంగా సదరు వ్యక్తి ఆమె మెడలో బంగారు గొలుసును తెంపుకోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ గొలుసును గట్టిగా పట్టుకున్నారు. కాసేపు దొంగ పెనుగులాడి, బ్లేడుతో ఆమె మెడపై కాట్లు వేసి పరారయ్యాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స కోసం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని