అనంత ప్రగతిలో ముందంజ
అక్షర క్రమంలో ముందుండే అనంతపురం జిల్లా అభివృద్ధిలోనూ ముందంజలో ఉందని, ఇందుకు జిల్లా యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోందని కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు.
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ నాగలక్ష్మి
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: అక్షర క్రమంలో ముందుండే అనంతపురం జిల్లా అభివృద్ధిలోనూ ముందంజలో ఉందని, ఇందుకు జిల్లా యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోందని కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో 74వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, శిక్షణా కలెక్టర్ ప్రశాంత్కుమార్, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిశీలన వాహనంలో కలెక్టర్, ఎస్పీ, పరేడ్ కమాండర్ రమేష్నాయక్తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు, సివిల్ పోలీస్, హోంగార్డులు, గైడ్స్ అండ్ స్కౌట్స్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధశాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శకటాలను ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ప్రదర్శించారు. పోలీసు శాఖ, దిశ పోలీసుస్టేషను సంయుక్తంగా నిర్వహించిన మహిళా పోలీసుల ద్విచక్ర వాహన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణాభివృద్ధి శకటం ప్రథమ బహుమతి గెలుపొందగా, గృహనిర్మాణశాఖ, అహుడా శకటాలు ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి.
* ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాతకు అండగా నిలవడానికి వైయస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 అందిస్తోందన్నారు. ఈ ఏడాది 2లక్షల 83 వేల కుటుంబాలకు రూ.320.41 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేశామన్నారు. వివిధ పథకాల ప్రగతిని వివరించారు.
పోలీస్పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తున్న
కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ కేతన్గార్గ్, ఎస్పీ ఫక్కీరప్ప
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీపీవోలో నిర్వహిస్తున్న ‘రక్షక్’ ప్రీ ప్రైమరీ పాఠశాల చిన్నారులు ‘దేశం మనదే.. తేజం మనదే’ అనే దేశభక్తి గీతానికి చక్కగా అభినయించారు. అలాగే కేఎస్సార్ ఉన్నత పాఠశాల, కురుగుంట, కూడేరు, బుక్కరాయసముద్రం కస్తూరిబా విద్యాలయాల విద్యార్థినులు దేశభక్తిని చాటేలా నృత్యం చేశారు. నగరంలోని కేఎస్ఎన్ విద్యార్థులు చేసిన కర్రసాము, కుస్తీ పోటీలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి, అహుడా ఛైర్పర్సన్ మహాలక్ష్మి శ్రీనివాస్, నాటక అకాడమీ ఛైర్పర్సన్ హరిత, ఆర్టీసీ రీజనల్ ఛైర్పర్సన్ మంజుల, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కస్తూర్బ విద్యార్థినుల నృతప్రదర్శన
జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నజిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
జిల్లా పోలీసు కార్యాలయంలో జెండాకు వందనం చేస్తున్న డీఐజీ రవిప్రకాష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు