అంగన్వాడీలతో పెట్టుకుంటే పతనమే..
‘కనీస వేతనం ఇవ్వరు. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస వసతులు సమకూర్చరు. కానీ, ముఖ గుర్తింపు హాజరు.. వంటి యాప్లను వాడాలని చెబుతారు.
ధర్నాలో ప్రసంగిస్తున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ‘కనీస వేతనం ఇవ్వరు. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస వసతులు సమకూర్చరు. కానీ, ముఖ గుర్తింపు హాజరు.. వంటి యాప్లను వాడాలని చెబుతారు. అదేలా సాధ్యం. అంగన్వాడీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదు. నిర్బంధం చేస్తే పతనం తప్పదు’ అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ అనుబంధ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అనంత కలెక్టరేట్ ముందు భారీ ధర్నా చేపట్టారు. ఓబులు మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోంది. ఇదే దారిలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోంది. పొరుగున ఉన్న తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలు, సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు, వేతనాలు ఇస్తోంది. ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ముఖ హాజరు పెట్టడం ఉద్యోగులను దొంగల్లా చూడటమేనని ఆరోపించారు. మొదట మీ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు నిత్యం భూకబ్జాలు, ఇసుక, మద్యం దోపిడీ వంటి వాటితో రూ.కోట్లు గడిస్తున్నారు. వారి వాహనాలకు జీపీఎస్, వారు ఎక్కడ వెళ్తున్నారో ఫేస్ యాప్లు పెట్టాలని డిమాండు చేశారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగేంద్రకుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కోశాధికారి జమున మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండు చేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు సావిత్రి, వెంకట నారాయణ, రామాంజనేయులు, చంద్రశేఖర్రెడ్డి, బాల రంగయ్య, ఏటీఎం నాగరాజు తదితరులు మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
కళ్యాణదుర్గం సమీపంలో సిబ్బందిని బస్సులో నుంచి దింపేసిన పోలీసులు
ఎక్కడికక్కడ నిర్బంధం
అనంత కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున చేపట్టిన ధర్నాకు జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్త, ఆయాలు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి.. వంటి ప్రాంతాల నుంచి బస్సుల్లో, ఇతర రవాణామార్గాల్లో వస్తున్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులు ఆపేసి... మధ్యలోనే దింపేశారు. సోమవారం తెల్లవారు జామున నుంచే ఆ సంఘం నాయకుల ఇళ్ల వద్దకు చేరుకుని గృహ నిర్బంధం చేశారు. ధర్నాకు వెళ్లొద్దంటూ నోటీసులు అందజేశారు. కొంతమంది నాయకులకు ఫోన్ చేసి బెదిరించారు. వీటన్నింటిని చేధించుకుని ధర్నాకు తరలిరావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!