logo

వైకాపాలో బహిర్గతమైన విభేదాలు

మడకశిర వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పోకల అశోక్‌కుమార్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన వైకాపా సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారం ఇక్కడకు వచ్చారు.

Published : 08 Feb 2023 06:20 IST

అసమ్మతి వర్గం నాయకులతో సమావేశమైన  అశోక్‌కుమార్‌

మడకశిర, న్యూస్‌టుడే: మడకశిర వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పోకల అశోక్‌కుమార్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన వైకాపా సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారం ఇక్కడకు వచ్చారు. సమావేశానికి ముందుగా ఆయన అసమ్మతి వర్గానికి చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆ వర్గం నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామిపై అసమ్మతివర్గం నాయకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో సచివాలయ కన్వీనర్లను ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా నియమించారని పరిశీలకుడి దృష్టికి వారు తీసుకెళ్లగా.. రాతపూర్వకంగా ఇస్తే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అసమ్మతి నాయకులు మాజీ మంత్రి నరసేగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే వైటీప్రభాకర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, కరుణాకర్‌, రంగేగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని