కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు.
అనంతపురం ఆర్టీసీ, న్యూస్టుడే: ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. ఇటీవల ఆలస్యంగా వెలుగు చూసిన ఓ నియామకంలో వైయస్ఆర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ నామినేటెడ్ పదవిలో అత్యున్నత స్థాయి వ్యక్తి చక్రం తిప్పినట్లు చర్చ నడుస్తోంది. అనంతపురం ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో జూనియర్ స్కేల్ ఆఫీసరు (డిపో మేనేజరు హోదా)లో ఉన్న ఓ అధికారి గత నెల 31న పదవీ విరమణ చేశారు. ఆయనే లా ఆఫీసరుగా విధులు నిర్వహించేవారు. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పడంతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉండే సమయంలో ఈ ఉత్తర్వులు వచ్చాయంటే పైరవీ ఏ స్థాయిలో ఉందన్నది స్పష్టం అవుతోంది. ఎన్నికల కోడ్ వచ్చే ఒకరోజు ముందుగా మార్చి 15న ఎండీ కార్యాలయంలో ఆమోదం పొందినట్లు రెఫరెన్సు పెట్టారు. వాస్తవానికి ఆయన మార్చి 31న పదవీ విరమణ చేస్తే ఆయనే ఉంటారని పదవీ విరమణ కంటే 15 రోజుల ముందుగానే ఎలా ఆమోదిస్తారన్నది మరో ప్రశ్న. లా ఆఫీసరుగా నియమిస్తూ ఏప్రిల్ 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏకంగా రెండేళ్లపాటు ఆయన లేబర్ ఆఫీసరుగా ఉంటారని నియామకపు ఉత్తర్వులను ఆర్ఎం జారీ చేశారు. సాధారణంగా పొరుగు సేవల ద్వారా నియామకం ఒక్కరినే ప్రామాణికంగా ఎలా తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఇప్పటికే పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారికి కూడా రెండేళ్లపాటు ఈ పోస్టుకు రాకుండా గండి కొట్టినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాల్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం గుర్తింపు
[ 01-05-2024]
పెనుకొండ నియోజకవర్గం రొద్దం పంచాయతీ పరిధిలోని పెద్దగువ్వల పల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. -
అవ్వాతాతల పింఛన్లపై జగన్నాటకం
[ 01-05-2024]
ఏ బిడ్డ కన్నవారిని కష్టపెట్టాలనుకోడు. ఏ మనవడు అవ్వతాతల్ని మండుటెండలో నిల్చోబెట్టి మాడ్చాలని కోరుకోడు. ఏ సోదరుడు అక్కాచెల్లెమ్మలను ఇబ్బంది పెట్టాలని తలంచడు.నోరు తెరిస్తే మీ బిడ్డనంటూ దీర్ఘాలు తీసే సీఎం జగన్ మాత్రం అవ్వాతాతలు, -
జగన్ పాలనలో 108 కుయ్యో.. మొర్రో
[ 01-05-2024]
108కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే అర్బన్ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్ బాధితులు ఇచ్చిన అడ్రస్కు చేరుకోవాల్సి ఉంది. -
దుర్గంలో ఎర్రమట్టి దోపిడీ
[ 01-05-2024]
రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. -
వంతెన హామీకి రెండున్నరేళ్లు
[ 01-05-2024]
అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలోని బుక్కరాయసముద్రం వద్ద వంకపై వంతెన నిర్మాణానికి వైకాపా ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి హామీ ఇచ్చి రెండున్నరేళ్లయింది. -
జాలిలేని జగన్ మామ..
[ 01-05-2024]
మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు. -
పల్లెల ప్రగతిపై ప్రభుత్వం నిర్లక్ష్యం
[ 01-05-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరవకొండ మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి గ్రామాలు పెద్దవి. -
బలిజలకు జగన్ వెన్నుపోటు పొడిచారు
[ 01-05-2024]
గత తెదేపా హయాంలో బలిజలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచి బలిజలను సర్వం నాశనం చేశారని కాపు సంఘం రాష్ట్ర ఐకాస నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆరోపించారు. -
అరాచక పాలనకు అంతం పలుకుదాం
[ 01-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపాకు అంతం పలుకుదామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం పలు గ్రామాల్లో మంగళవారం పరిటాల సునీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
బరిలో పెరిగిన పోటీదారులు
[ 01-05-2024]
జనాలకు రాజకీయాల పట్ల ఆసక్తి నానాటికి పెరుగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. -
‘ఆశీర్వదించండి.. 114 చెరువులను నింపుతా’
[ 01-05-2024]
ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే రెండున్నరేళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులను నింపుతానని, రహదారులను బాగు చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం
[ 01-05-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భారీగా నగదు పట్టివేత
[ 01-05-2024]
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంత అర్బన్ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. -
రానున్న మూడ్రోజుల్లో తీవ్ర వడగాలులు
[ 01-05-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. -
‘ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం’
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి మంగళవారం విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికి సమ ప్రాధాన్యం కల్పించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజినప్ప పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి