logo

తెదేపాతోనే మీ భూములకు రక్షణ: నారా రోహిత్‌

తెదేపా అధికారంలోకి వచ్చి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మీ భూములకు గ్యారంటీ లభిస్తుందని సినీ హీరో నారా రోహిత్‌ అన్నారు. గురువారం రొళ్లలో నిర్వహించిన తెదేపా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

Published : 10 May 2024 03:48 IST

రొళ్ల, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి వచ్చి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మీ భూములకు గ్యారంటీ లభిస్తుందని సినీ హీరో నారా రోహిత్‌ అన్నారు. గురువారం రొళ్లలో నిర్వహించిన తెదేపా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఈ అయిదేళ్లు అరచేతిలో విశ్వరూపం చూపించిందని ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసి కక్ష సాధించిందని ఎద్దేవా చేశారు.

గుడిబండ: తెదేపాకు పట్టం కట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని సినీ హీరో నారా రోహిత్‌, హాస్యనటుడు రఘులు పేర్కొన్నారు. గుడిబండ, రొళ్లలో గురువారం  నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో జరిగిన రోడ్‌షో, బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. నారా రోహిత్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో అన్నిరంగాల వారు అణగారిపోయారని, అభివృద్ధి ఏ మాత్రం జరగలేదన్నారు. మడకశిర కూటమి అభ్యర్థి ఎంఎస్‌రాజు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిను గెలిపించాలని కోరారు. ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు, నారా లోకేశ్‌లతో మాట్లాడి అధిక నిధులు తెచ్చి అర్ధాంతరంగా ఆగిన పనులను పూర్తి చేయడంతో పాటు అన్ని చెరువులకు నీరు నింపుతామని, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ విద్యుత్‌, మట్టి, ఇసుక జోలికి వెళ్తే స్టేషన్లు, జైలుకు వెళ్లాల్సిన ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పేదలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని