logo

తెర వేసి.. మురుగు కనిపించకుండా చేసి..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల, తిరుపతికి మంగళవారం వస్తున్నారు. వచ్చే మార్గంలో బాలాజీ కాలనీ  కుమ్మరితోపు వద్ద మురుగునీటి కాలువలో....

Updated : 27 Sep 2022 05:06 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల, తిరుపతికి మంగళవారం వస్తున్నారు. వచ్చే మార్గంలో బాలాజీ కాలనీ  కుమ్మరితోపు వద్ద మురుగునీటి కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు కన్పించకుండా అధికారులు ఆకుపచ్చ తెర ఏర్పాటు చేశారు.

* పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఫ్లెక్సీలు వాడవద్దని.. సాక్షాత్తు  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినా.. నాయకులు చెవికి ఎక్కించుకోవడం లేదు. జాతీయ రహదారి నుంచి దారి పొడువునా ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాలు కన్పించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాంధీరోడ్డు నాలుగుకాళ్ల మండపం నుంచి ఇందిర ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌ కూడలి వరకు రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు దుకాణాలకు వెళ్లే పరిస్థితి లేదు.

* వెస్ట్‌ చర్చి నుంచి బాలాజీకాలనీ కూడలికి వెళ్లే మార్గంలో గతంలో వేసిన బొమ్మలపై వైకాపా పార్టీకి చెందిన రంగులు అద్దారు.


గోడలపై ఉన్న బొమ్మలపై వేసిన వైకాపా రంగులు

- ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని