logo

Kuppam: పెళ్లైన మూడు నెలలకే.. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ప్రేమించి.. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా వివాహ జీవనం సాగించారు. ఇంతలో ఏమైందో ఏమో.. మూడు ముళ్లు పడి మూడు నెలలు కాలేదు..

Updated : 04 Nov 2022 11:11 IST

భువనేశ్వరి, రోహిత్‌ పెళ్లి నాటి చిత్రం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ప్రేమించి.. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా వివాహ జీవనం సాగించారు. ఇంతలో ఏమైందో ఏమో.. మూడు ముళ్లు పడి మూడు నెలలు కాలేదు.. వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పాతపేటకు చెందిన రోహిత్‌, భువనేశ్వరి రెండు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆనందంగా కనిపించిన భువనేశ్వరి(25) అనంతరం ఇంటి మిద్దెపై ఉన్న గదిలో దూలానికి వేలాడుతూ మృతి చెంది కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలిని కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త ఇంటివారే తమ బిడ్డను హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ శ్రీధర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని