యువగళం.. జనబలం
యువగళం పాదయాత్రకు జన బలం తోడైంది. వైకాపా ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డవారు బాధలు చెప్పుకోవడానికి వేదికైంది. కులవృత్తులవారు.. మైనార్టీలు ఇలా అన్ని వర్గాల వారు గోడు వెళ్లబోసుకోగా.. అండగా ఉంటానంటూ నారా లోకేశ్ పాదయాత్ర భరోసా ఇచ్చారు.
యువగళం పాదయాత్రకు జన బలం తోడైంది. వైకాపా ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డవారు బాధలు చెప్పుకోవడానికి వేదికైంది. కులవృత్తులవారు.. మైనార్టీలు ఇలా అన్ని వర్గాల వారు గోడు వెళ్లబోసుకోగా.. అండగా ఉంటానంటూ నారా లోకేశ్ పాదయాత్ర భరోసా ఇచ్చారు. ‘యువగళం’ పాదయాత్ర పదోరోజైన ఆదివారం చిత్తూరు జిల్లా తవణంపల్లె, ఐరాల మండలాల్లో సాగింది. జన సమస్యలు వింటూ.. పరిష్కారానికి హామీ ఇస్తూ.. వారితో మమేకమై ముందుకు సాగారు.
ముస్లిం మైనార్టీలకు జగన్ వెన్నుపోటు
ఐరాల, న్యూస్టుడే: రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలకు జగన్ వెన్నుపోటు పొడిచారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాణిపాకంలో ముస్లిం మైనారిటీ సోదరులతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం వచ్చాక మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు నిలిపివేశారన్నారు. తెదేపా ప్రభుత్వ పథకాలైన దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్యను రద్దు చేసి కష్టాల్లోకి నెట్టారన్నారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. ముస్లిం విద్యార్థులపై వైకాపా నాయకులు తప్పుడు కేసులు పెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. తెదేపా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో కేసులు మాఫీ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. తప్పుడు కేసులపై న్యాయ విచారణ చేస్తామన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన పథకాలను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి వికేంద్రీకరణ తెదేపా లక్ష్యం
పూతలపట్టు: ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ తెదేపా లక్ష్యమని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆదివారం తవణంపల్లె మండలం ఐరాల క్రాస్లోని సీడీఎం కల్యాణ మండపంలో యువతతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. పరిపాలన ఒకే చోట ఉండాలి.. అభివృద్ధిలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా పాలనలో రాష్ట్రానికి 13 పరిశ్రమలు తీసుకొచ్చామని, వైకాపా పాలనలో పరిశ్రమలన్నీ పారిపోయాయన్నారు. కియా పరిశ్రమ ఒక విత్తనం మాత్రమే. ఈ పరిశ్రమకు అనుగుణంగా మరిన్ని పరిశ్రమలు తెప్పించి తద్వారా యువత పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలైన ఓసీలకు కూడా విదేశాల్లో చదువుకునే అవకాశం చంద్రబాబు కల్పించారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎల్కేజీ నుంచి పీజీ వరకు సిలబస్లో మార్పులు తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టులు ప్రారంభించింది తామేనని, పూర్తిచేసేది మేమేనని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ జాబ్ క్యాపిటల్గా ఉండేది..జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్ క్యాపిటల్గా మారిందన్నారు.
రూ.5 వేలు, రూ.10 వేలకు పనిచేస్తున్నాం
-అజయ్, యువకుడు
సార్.. చదివిన చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు పొంతన లేదు. తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్లి రూ.5 వేలు, రూ.10 వేలకు పని చేస్తున్నాం. మీరు పాదయాత్ర చేస్తున్నారని తెలిసి మా బాధలు చెప్పుకొందామని వచ్చాం. మీరైనా రాష్ట్రంలోని నిరుద్యోగులను గుర్తించి పరిశ్రమలు తీసుకొస్తారని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాం. రాష్ట్రంలో పేరుకుపోయిన కుళ్లు, కుతంత్రాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.
10 టన్నుల పుష్పాలు.. 3 కి.మీ తివాచీ
మద్దిపట్లపల్లెకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు నాగేశ్వరచౌదరి ఆయన కుమారుడు ప్రణీత్చౌదరి 10 టన్నుల పుష్పాలతో కాణిపాకం నుంచి ఐరాల క్రాస్ వరకు సుమారు 3 కి.మీ. పొడవునా లోకేశ్కు పూల తివాచీ పరిచారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చారు.
వైకాపా పాలనలో నిధులు రాలేదన్న గాండ్ల కులస్థులు
ఐరాల, న్యూస్టుడే: తవణంపల్లె మండలంలో సుమారు రెండు వేల మంది ఉన్నామని, వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి నిధులు రాలేదని గాండ్ల కులస్థులు లోకేశ్ ఎదుట ఆవేదన చెందారు. మహిళలకు కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు అందించాలని కోరారు. కులవృత్తికి సంబంధించి నూనె మిల్లులు పెట్టుకోవడానికి రాయితీ కింద నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
లోకేశ్: రాష్ట్రంలో గాండ్ల కులస్థులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ఆర్భాటంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కనీసం ఒక్క రూపాయి రుణంగా ఇవ్వలేదు. తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. నూనె మిల్లులు ఏర్పాటు చేస్తాం.
ప్రార్థనలకు వెళ్లనీయడం లేదు..
-జె.బాషా, 14 కండ్రిగ
యాదమరి మండలం 14 కండ్రిగ ముస్లింవాడలో ఉన్న ముస్లింలను ప్రార్థనలకు వెళ్లనీయకుండా వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారు. వారి దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. షాదీమహల్ నిర్మాణాన్ని నిలిపివేశారు. మసీదు స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అడిగితే కొట్టేందుకు వస్తున్నారు. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి.
ప్రసంగంలో విశేషాలు..
తవణంపల్లె, న్యూస్టుడే: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం తవణంపల్లె మండలంలో ముగిసింది. మారేడుపల్లి రహదారి వద్ద సమావేశం నిర్వహించారు. ఆయన ప్రసంగంలో విశేషాలు
* ట్రైలర్ మాత్రమే అయింది.. అసలు సినిమా ముందుంది.. పాదయాత్ర అయింది 10 రోజులే.. ఇంకా 390 రోజులుంది.
* 2019 ఎన్నికల్లో జగన్ అవ్వ.. తాత.. అక్క.. చెల్లి... అని ముద్దులు పెట్టారు.. ఇప్పుడు పన్నుల పేరుతో బాదుతున్నాడు.
* నా మీద 175 కేసులు పెట్టండి.. కానీ ఏ1గా నన్ను పెట్టండి.. జగన్.. నీ కేసులకు ఎవరూ భయపడరు.
* బాబాయ్ని చంపింది ఎవరు.. అబ్బాయ్...
* సీఎం పరదాలు పెట్టుకుని బయటకెళ్తారు. ప్రజలంటే భయం.. సీబీఐ అంటే ఇంకా భయం..
* ఇదే ఉత్సాహం.. ఇదే ఉత్తేజంతో పనిచేస్తే 175 నియోజక వర్గాలు కైవసం చేసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్