రూ.1.85లక్షల అక్రమ మద్యం స్వాధీనం
పలమనేరు జాతీయ రహదారిలోని మొగిలిఘాట్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరసింహారెడ్డి తెలిపారు.
ఇద్దరు నింతుల అరెస్టు
బంగారుపాళ్యం: పలమనేరు జాతీయ రహదారిలోని మొగిలిఘాట్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ కథనం మేరకు.. గుడిపాల మండలం పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన సెందిల్కుమార్(29), గొల్లమడుగు గ్రామానికి చెందిన సురేష్రెడ్డి(28) కారులో బెంగళూరు నుంచి చిత్తూరు వైపునకు కర్ణాటక మద్యం తరలిస్తుండగా మొగిలిఘాట్లో వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై మల్లికార్జునరెడ్డి కారులోని సుమారు రూ.1.85లక్షల విలువైన మద్యం, రూ.6లక్షల విలువైన కారు, రూ.50వేలు విలువైన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు సెందిల్కుమార్, సురేష్రెడ్డిలను అదుపులోనికి తీసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: అనుష్కను చూసి వణికిపోయా: విరాట్ కోహ్లీ
-
General News
Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ
-
India News
₹10 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపులు.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!
-
Movies News
Payal Rajput: పాయల్ రాజ్పుత్కు అస్వస్థత.. అయినా షూట్లో పాల్గొని!
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి