ఎక్కడ నియమిస్తారో..!
డీఎస్సీ-1998 అభ్యర్థులకు నియామకాలు ఏ విధంగా చేపడతారో స్పష్టత లేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మిగులు పోస్టులను రెండు నెలల క్రితం సర్దుబాటు చేశారు.
డీఎస్సీ 1998 అభ్యర్థుల పోస్టింగ్లపై కదలిక
చిత్తూరు విద్య, న్యూస్టుడే: డీఎస్సీ-1998 అభ్యర్థులకు నియామకాలు ఏ విధంగా చేపడతారో స్పష్టత లేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మిగులు పోస్టులను రెండు నెలల క్రితం సర్దుబాటు చేశారు. దీంతో అధికారుల గణాంకాల ప్రకారం ఖాళీలు లేనట్లు సమాచారం. ఇప్పుడు వీరిని ఒప్పంద పద్ధతిలో ఎక్కడెక్కడ నియమిస్తారోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అభ్యర్థుల మెరిట్ జాబితాను రెండు, మూడ్రోజుల్లో జిల్లా విద్యాశాఖాధికారులు పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఖాళీలు లేని పక్షంలో 1998 డీఎస్సీ అభ్యర్థులను ఏవిధంగా సర్దుబాటు చేస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది. ఇప్పటికే జిల్లాలో 480మంది అభ్యర్థులు ఆన్లైన్లో ధ్రువ పత్రాలు అప్లోడ్ చేసుకున్నారు. వాటిని ఐదు నెలల క్రితం పరిశీలించారు. అప్పటినుంచి ధ్రువ పత్రాల పరిశీలన చేసుకున్న వారందరూ నియామకం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఆ అభ్యర్థులకు ఖాళీలు చూపుతారో లేదో అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి డీఎస్సీ 1998 అభ్యర్థుల నియామకానికి సంబంధించి మార్గదర్శకాలు రావాల్సి ఉందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీఈవో విజయేంద్రరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న జమానా.. పన్నులతో హైరానా
[ 10-05-2024]
పుత్తూరు పట్టణానికి చెందిన వీరయ్యకు గతంలో రూ.2,500 ఇంటి పన్ను చెల్లించేవాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధించడంతో రూ.4,500 చెల్లించాలని పురపాలక సంఘ అధికారులు అతడికి డిమాండ్ నోటీసు అందించారు. -
ఓటర్లకు డబ్బుతో వైకాపా గాలం..!
[ 10-05-2024]
ఐదేళ్లుగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న వైకాపా.. ఎన్నికల్లో విజయం సాధించాలని డబ్బుతో ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది. -
పోలింగ్ కేంద్రాల్ని అప్పగించాలి
[ 10-05-2024]
పోలింగ్ కేంద్రాల్ని శుక్రవారం నాటికి సెక్టోరియల్ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. ఎంఈవోలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. -
నమ్మించడం.. వంచించడం.. ఇదే జగన్ నైజం
[ 10-05-2024]
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు. -
తెదేపా ఆకలి తీర్చింది.. వైకాపా మూసేసింది
[ 10-05-2024]
రూ.2కే పేదలకు కిలో బియ్యం అందించిన తేదేపా ప్రభుత్వం వారి ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. -
జెండాలు వేరైనా.. అజెండా ఒకటే...!
[ 10-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటే అని నందమూరి రామక్రిష్ణ అన్నారు. మండలంలోని అరగొండ గ్రామంలో వైకాపాకు చెందిన రంజిత్కుమార్రెడ్డి, విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులకు ఆయన గురువారం తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
దేశానికి మోదీ.. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ అన్నారు. -
ప్రజలు ఎలాపోతే మనకేంటి..?
[ 10-05-2024]
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది.. -
జగన్.. పన్నుతో వేధించెన్
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూలధన విలువ ఆధారిత(సీవీ) ఆస్తిపన్ను విధింపుతో పట్టణ ప్రాంత భవనాలు, ఇళ్ల యజమానులపై మోయలేని భారం పడింది. -
సూపర్-6తోనే సామాజిక న్యాయం..!
[ 10-05-2024]
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్-6 పేరుతో చంద్రబాబు ప్రజల ముందుకు రాగా.. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రతిపాదించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. -
రెచ్చగొట్టి దాడిచేశారు
[ 10-05-2024]
రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఏర్పేడు మండలం దుర్గిపేరిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఎన్నికల రోజు కార్మికులకు సెలవు
[ 10-05-2024]
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్ యం.బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఓటు వేయడానికి మూడు గంటలు వేచి చూడాలా ?
[ 10-05-2024]
‘మేడమ్.. నేను వచ్చి సుమారు మూడు గంటల సేపవుతోంది. ఎన్నికల విధుల నుంచి ఇచ్చిన ఆర్డరు చూపించా. నా ఓటు చిత్తూరులో ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు