ప్రజలు ఎలాపోతే మనకేంటి..?
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది..
చెరువు ప్రాజెక్టు బుట్టదాఖలు
ఐదేళ్లుగా దృష్టిపెట్టని వైనం
అమలులో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం
కట్టమంచి చెరువు
న్యూస్టుడే, చిత్తూరు నగరం: నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది.. ప్రజలకు సంబంధించిన వ్యవహారం కదా.. వాళ్లు ఎలా పోతే మనకేంటి అన్న రీతిన వ్యవహరించింది.. ఫలితంగా సగటు నగరవాసికి ఆహ్లాదం ఆవిరిగా మారింది.. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించినా.. వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత అసలు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోనే లేదు.. దీంతో చిత్తూరు నగరవాసులు కాసింత ఆహ్లాదం కోసం వేకళ్ల ఎదురుచూస్తున్నారు.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆశగా వేచిఉన్నారు.
చిత్తూరు నగరం నడిబొడ్డున 13.84 ఎకరాల విస్తీర్ణంలో కట్టమంచి చెరువు విస్తరించి ఉంది. గతంలో వందల ఎకరాల ఆయకట్టు భూములకు ఈ చెరువు నీరు ఉపయోగపడింది. కాలక్రమేణా సప్లై ఛానళ్లు మూసుకుపోవడంతో వ్యవసాయ అవసరాలకు పూర్తిగా దూరమైంది. ఈ నేపథ్యంలో చెరువును అహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిద్ది నగర ప్రజలకు అందుబాటులో పెట్టడానికి తెదేపా ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థ ఓ బృహత్తర ప్రణాళిక రూపొందించింది. కట్టమంచి చెరువు సుందరీకరణకు నగరపాలక సంస్థ రూ.2.6 కోట్లతో రూపొందించిన ప్రణాళికను.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత అసలు పట్టించుకోలేదు. ఆ ప్రతిపాదనను పూర్తిగా బుట్టదాఖలు చేసింది. చెరువు కట్ట ఆధునికీకరణ, పాదచారుల కోసం టైల్స్తో ప్రత్యేక రహదారి, మొక్కల పెంపకం, సిమెంటు బల్లల నిర్మాణం ఈ ప్రణాళికలో రూపొందించారు. దీంతోపాటు చెరువు చుట్టూ రెయిలింగ్, విద్యుత్తు దీపాల ఆధునికీకరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక నిర్మాణం తదితర అభివృద్ధి పనులతో ప్రణాళిక రూపొందించినా వీటిలో కొన్ని పనుల్ని మాత్రమే గత ప్రభుత్వంలో పూర్తిచేయాల్సి వచ్చింది.
అంతా నిరుత్సాహమే..
ఈ ప్రధాన ప్రాజెక్టు అమలుకు నోచుకోక పోవడంతో నగర ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆయా పనులు పూర్తయితే హైదరాబాద్లోని ట్యాంక్బండ్ తరహాలో నగర ప్రజలకు కట్టమంచి చెరువు ఆహ్లాదాన్ని పంచే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువు సుందరీకరణ పనులు ఆపరాదని నగరపాలక, నీటిపారుదల శాఖల అధికారులకు గతంలో కలెక్టర్గా పనిచేసిన ప్రద్యుమ్న ఆదేశించారు. అయినా ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ప్రారంభించ లేదు. అప్పట్లో చెప్పిన కలెక్టర్ ఇప్పుడు లేడు. పైగా దానిగురించి నగరవాసులు నోరెత్తి అడగలేరు. ఇక దీన్ని మనమెందుకు చేయాలనే తరహాలో వైకాపా సర్కారు చేతులెత్తేసింది. పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ కనీసం ప్రజలకు సేవలు అందించడంలో నగరపాలక సంస్థకు లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో తామెక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించి విహార అనుభూతిని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చెరువు కట్ట అభివృద్ధికి రూపొందించిన నమూనా
చెరువును అభివృద్ధి చేయాలి..
నగరంలో ప్రధాన నీటి వనరుగా ఉన్న కట్టమంచి చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చక్కటి ఆహ్లాదకర వాతావరణం తీర్చిదిద్దాలి. తద్వారా ప్రజలకు ఓ కొత్త అనుభూతి కల్పించాలి. జిల్లా కేంద్రంలో ప్రజలు ప్రశాంతంగా సేద దీరే ప్రాంతాలు తక్కువగా ఉన్నాయి. తిరుపతి నగరంతో సమానంగా చిత్తూరును అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు సహకరించాలి.
లోచన్, చిత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు భరోసా.. సేవల్లో నిరాశ
[ 20-05-2024]
చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు.. -
దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?
[ 20-05-2024]
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. -
ఇవేం పనులు రాజశేఖరా..?
[ 20-05-2024]
-
విచారణ తొక్కిపెట్టేసి..
[ 20-05-2024]
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. -
ఎర్రమట్టి కొల్లగొట్టి..కోట్లకు పడగలెత్తి
[ 20-05-2024]
ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. -
సీబీఎస్ఈ.. పాఠం బోధపడేనా?
[ 20-05-2024]
అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్ఈ, ఐబీ, బైజూస్ కంటెంట్ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది. -
ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
[ 20-05-2024]
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. -
కపిలతీర్థంపై కరుణ లేదా?
[ 20-05-2024]
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. -
ఏడు గంటలపాటు.. సిట్ విచారణ
[ 20-05-2024]
చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది. -
ముగిసిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
[ 20-05-2024]
శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. -
‘దళితుల మధ్య చిచ్చుపెట్టడం మంత్రి పెద్దిరెడ్డికి తగదు’
[ 20-05-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు. -
గమ్యం చేరేలోగా మృత్యుఒడికి..
[ 20-05-2024]
ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్