నమ్మించడం.. వంచించడం.. ఇదే జగన్ నైజం
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు.
విపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలు నెరవేర్చని వైనం
మరోసారి ఓటర్లను మోసగించేందుకు పుత్తూరు పర్యటన
నాటి మాటలు
‘మీ అండదండలతోనే సుదీర్ఘ పాదయాత్ర చేశా. నేను వెళ్తున్న దారి పొడవునా ఎంతోమందిని కలిశా. వారి సాధక బాధలు విన్నా. ఐదేళ్ల పాలనలో పడిన ఇబ్బందులు చూశా. మీ అందరికీ నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. నేను విన్నాను.. నేను ఉన్నాను.. మన పార్టీ అధికారంలోకి రాగానే సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తా. గాలేరు- నగరి సుజల స్రవంతిని పరుగులు తీయిస్తా’
ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలివి.
చేతలు ఇలా..
జగన్ విన్నారు.. అధికారంలోకి వచ్చారు. ఆపై వంచన పర్వానికి తెరలేపారు. సమస్యలు తీరుస్తాడని ఆశించిన ప్రజలను నమ్మకంగా మోసగించారు. ముఖ్యమంత్రి అయ్యాక జనానికి ముఖం చాటేశారు. సహకార చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించాల్సింది పోయి అమ్మేసేందుకు ప్రణాళిక రచించారు. ప్రైవేటు కర్మాగారాలు బకాయిలు ఇవ్వకపోయినా ఆయన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు గాలికి వదిలేశారు. నమ్మించడం.. వంచించడం మాత్రమే తన నైజమని అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నగరి నియోజకవర్గం పుత్తూరు వస్తున్నారు. మరోసారి అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించాలనే తలంపుతో ఉన్న జగన్కు ఈసారి ఓటుతో గట్టిగా బుద్ధి చెబుతామని ఓటర్లు అంటున్నారు.
ఈనాడు, చిత్తూరు; న్యూస్టుడే, పుత్తూరు
రేణిగుంటలో మూతపడిన సహకార చక్కెర కర్మాగారం
రేణిగుంట మండలం గాజులమండ్యంలో 1978లో సుమారు 167 ఎకరాల్లో ఎస్వీ సహకార చక్కెర కర్మాగారాన్ని స్థాపించారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని దాదాపు 13 వేల మంది రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఏటా 2.50 లక్షల టన్నుల క్రషింగ్ జరిగే ఈ పరిశ్రమ మూతపడింది. ఈ కర్మాగారం పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక పూర్వ వైభవం రాకపోగా లిక్విడేటర్ను ఏర్పాటు చేసి ఆస్తులు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. రైతుల న్యాయ పోరాటంతో దీనికి బ్రేకులు పడ్డాయి. ఎస్వీ చక్కెర కర్మాగారానికి రూ.110 కోట్ల నష్టాలున్నాయని చూపుతూ దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను తన అనుచరగణానికి కట్టబెట్టాలని సీఎం ప్రయత్నిస్తున్నారు.
నేటమ్స్ బకాయిలు ఎప్పుడిప్పిస్తారు?
నిండ్రలో మూతపడిన నేటమ్స్ చక్కెర పరిశ్రమ
నిండ్ర మండలం నేటమ్స్ చక్కెర కర్మాగారం అన్నదాతలకు బకాయిలు చెల్లించనందున 2019లో క్రషింగ్ ఆపేశారు. అంతకుముందు నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 3వేల మంది రైతులకు రూ.35.50 కోట్లు యాజమాన్యం బకాయి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నగరి ఎమ్మెల్యే రోజా సమస్య పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కొంతకాలానికి ఆమె బకాయిల చెల్లింపు తన బాధ్యత కాదన్నట్లుగా చేతులెత్తేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా పట్టించుకోలేదు.
గాలేరు- నగరిని గాలికొదిలేసి
వైకాపా అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చెప్పారు. గతేడాది ఆగస్టులో నగరిలో పర్యటించినప్పుడు సైతం ఇవే మాటలు వల్లించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క అడుగూ పడలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతంలో 1.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయని తెలిసినా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రికి మనసు రాలేదు. అంచనాలు మాత్రం పెంచేశారు. ఇందులో భాగమైన బాలాజీ, మల్లెమడుగు, వేణుగోపాలసాగర్ జలాశయాల నిర్మాణం పూర్తి కాలేదు. చిత్తూరు జిల్లాకు ఏం చేశారని ఆయన ఇప్పుడు పుత్తూరులో ఓట్లు అడుగుతారు?
నేతన్నలను మగ్గానికి దూరం చేసి..
2019 ఎన్నికల ప్రచారంలో జగన్ నగరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరమగ్గాల కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే యూనిట్కు 6 పైసలుగాన్న విద్యుత్తు సుంకాన్ని రూపాయికి పెంచారు. ఎన్నికలు సమీపించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి ఆరు పైసలు చేసినా కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలంటూ మూడింతల విద్యుత్తు బిల్లు చేతికి అందిస్తున్నారు. గతంలో రూ.600 బిల్లు వస్తే అది రూ.2వేలకు చేరిందని కార్మికులు వాపోతున్నారు.
ః నగరిలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కలగానే మిగిలింది. ఇది ఏర్పాటయితే నేతన్నల తలరాతలు మారుతాయని, నగరి పట్టణంలో రంగునీటి కాలుష్యం తగ్గుతుందని ఆశలు పెట్టుకున్నారు. దీన్ని కూడా జగన్ సాకారం చేయలేదు. ః ఏ ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని వెంటపడతారు. జగన్ జమానాలో మాత్రం పరిస్థితి తిరగబడింది. విజయపురం మండలం కోశలనగరాన్ని అభివృద్ధి చేస్తే పరిశ్రమలు నెలకొల్పుతామని తమిళనాడులోని యాజమాన్యాలు ముందుకొచ్చినా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు భరోసా.. సేవల్లో నిరాశ
[ 20-05-2024]
చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు.. -
దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?
[ 20-05-2024]
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. -
ఇవేం పనులు రాజశేఖరా..?
[ 20-05-2024]
-
విచారణ తొక్కిపెట్టేసి..
[ 20-05-2024]
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. -
ఎర్రమట్టి కొల్లగొట్టి..కోట్లకు పడగలెత్తి
[ 20-05-2024]
ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. -
సీబీఎస్ఈ.. పాఠం బోధపడేనా?
[ 20-05-2024]
అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్ఈ, ఐబీ, బైజూస్ కంటెంట్ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది. -
ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
[ 20-05-2024]
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. -
కపిలతీర్థంపై కరుణ లేదా?
[ 20-05-2024]
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. -
ఏడు గంటలపాటు.. సిట్ విచారణ
[ 20-05-2024]
చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది. -
ముగిసిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
[ 20-05-2024]
శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. -
‘దళితుల మధ్య చిచ్చుపెట్టడం మంత్రి పెద్దిరెడ్డికి తగదు’
[ 20-05-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు. -
గమ్యం చేరేలోగా మృత్యుఒడికి..
[ 20-05-2024]
ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల