మళ్లీ వాయిదానే
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఫలితంగానే సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.
మారిన సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం
ఈనాడు, తిరుపతి, ఈనాడు డిజిటల్, చిత్తూరు, న్యూస్టుడే, శ్రీకాళహస్తి
ఈ చిత్రంలో కనిపిస్తున్నది శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు లేఔట్. తిరుపతి నగరంతోపాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు. 2020 డిసెంబరు 28న పక్కా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. ఇక్కడ మంజూరైన 5,116 ఇళ్లలో ఉగాది నాటికి 1,200 పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపేశారు. ఉగాది నుంచి ఏప్రిల్ 15కు ముహూర్తాన్ని వాయిదా వేసినా.. అప్పటికైనా నిర్మాణాలు పూర్తవుతాయా? అంటే సందేహమే.
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఫలితంగానే సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారీ వాయిదా వేస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో 50 శాతం ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తికాగా చిత్తూరు జిల్లాలో లక్ష్యానికి మించి పూర్తయినా మౌలిక సదుపాయాల లేమి వెంటాడుతోంది.
తిరుపతి నగరానికి 20- 25 కి.మీ దూరంలో ఉండటంతో
రాష్ట్రంలోని పేదలందరికీ సొంత గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2020- 21 ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో 72,225, తిరుపతి జిల్లాలో 71,867 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబరు 21 నాటికి రెండు జిల్లాల్లో కలిపి కేవలం 34.29 శాతం ఇళ్లు అంటే 49,415 పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇళ్ల స్థలాలు దూరంగా ఉండటం, అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇసుక కొరత, నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరగడంతో నిర్మాణాలకు పేదలు పెద్దగా ముందుకు రాలేదు. తిరుపతి నగరంలోని ప్రజలకు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు, ఏర్పేడు మండలం చిందేపల్లిలో ఇళ్లు ఇచ్చారు. సుమారు 20- 25 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడం అది కూడా ఒక్క సెంటు మాత్రమే ఉండటంతో నగరంలోని పేదలు పెద్దగా ఆసక్తి చూపలేదు. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి- ఎం.కొత్తపల్లి మార్గంలోని గుట్టల్లోనూ స్థలాలు ఇచ్చారు. ఈ ప్రాంతం 22- 30 కి.మీ దూరంలో ఉంది. రోజూ ఆటో లకే రూ.300- రూ.400 ఖర్చవుతోందని, పునాదులు తీసేందుకే రూ.లక్షల్లో ఖర్చయ్యే పరిస్థితి ఉన్నందున నిర్మాణాలకు సుముఖత చూపడంలేదు. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని కొన్ని లేఔట్లలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
జిల్లాలో మంజూరైన ఇళ్లు 71,867
ఉగాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినవి 24,756
పూర్తయినవి 12,974
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..