logo

సీఐకి త్రుటిలో తప్పిన ప్రమాదం

అయ్యప్పరెడ్డిపాళెం సమీపంలో జాతీయ రహదారి వద్ద గురువారం పోలీస్‌ జీపు, ట్రాక్టరు ఢీకొన్న ప్రమాదంలో నాయుడుపేట పట్టణ సీఐ ప్రభాకర్‌రావు, కానిస్టేబుల్‌, హోంగార్డుకు ప్రమాదం త్రుటిలో తప్పింది.

Published : 31 Mar 2023 02:32 IST

పోలీస్‌ జీపును ఢీకొన్న ట్రాక్టరు

ప్రమాదంలో దెబ్బతిన్న పోలీసు జీపు

నాయుడుపేట, న్యూస్‌టుడే: అయ్యప్పరెడ్డిపాళెం సమీపంలో జాతీయ రహదారి వద్ద గురువారం పోలీస్‌ జీపు, ట్రాక్టరు ఢీకొన్న ప్రమాదంలో నాయుడుపేట పట్టణ సీఐ ప్రభాకర్‌రావు, కానిస్టేబుల్‌, హోంగార్డుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. విధి నిర్వహణలో భాగంగా పండ్లూరు నుంచి నాయుడుపేట వైపుగా వస్తోన్న జీపును ఇదే మార్గంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొంది. జీపు ముందుభాగం దెబ్బతినగా సీఐ ప్రభాకర్‌రావు, కానిస్టేబుల్‌ చిరంజీవి, హోంగార్డు వెంకి గాయపడ్డారు. వారికి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. సీఐ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, స్థానిక నేతలు పరామర్శించారు. పోలీసులు ట్రాక్టరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చికిత్స పొందుతున్న సీఐ ప్రభాకర్‌రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని