తేలని సిమెంట్ లెక్కలు
సచివాలయ భవన నిర్మాణాలకు కేటాయించిన సిమెంట్కు ఎంతకూ లెక్కలు తేలడం లేదు. గుత్తేదారులు పలుచోట్ల సొంత అవసరాలకు వినియోగించగా మరికొందరు వేరొకరికి విక్రయించిన సందర్భాలున్నాయి.
పూర్తికాని సచివాలయ భవనాలు
దొరవారి సత్రం మండలం ఏకొల్లులో ఇలా..
సూళ్లూరుపేట, న్యూస్టుడే: సచివాలయ భవన నిర్మాణాలకు కేటాయించిన సిమెంట్కు ఎంతకూ లెక్కలు తేలడం లేదు. గుత్తేదారులు పలుచోట్ల సొంత అవసరాలకు వినియోగించగా మరికొందరు వేరొకరికి విక్రయించిన సందర్భాలున్నాయి. దీనిపై పలుచోట్ల వివాదం ఎంతకూ తేలని పరిస్థితి నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.
వైకాపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మించాల్సి ఉంది. భవనానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వమే సిమెంట్ సరఫరా చేసింది. అయితే సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పలుచోట్ల సిమెంట్ మాయమైంది. విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 69 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో ఓజిలి మండలంలో 10, దొరవారిసత్రంలో 11,నాయుడుపేటలో 11, పెళ్లకూరులో 13, సూళ్లూరుపేటలో 8, తడలో 16 సచివాలయాలు ఉండగా సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, ఆర్బీకేలకు వచ్చిన సిమెంటులో గోల్మాల్ జరిగింది.
కొన్నింటిని పరిశీలిస్తే..
దొరవారిసత్రం మండలంలోని వేణుంబాక, కల్లూరు, సూళ్లూరుపేట మండలంలోని దామానెల్లూరు, కేసీఎన్గుంట, తదితర పంచాయతీల్లో నేటి వరకు భవనాలు పూర్తిస్థాయిలో నిర్మించలేదు. వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు సైతం అరకొరగానే చేపట్టారు. అయితే ఇక్కడకు ప్రభుత్వం రెండేళ్ల కిందట సరఫరా చేసిన సిమెంట్ మాత్రం మాయమైంది. దీనిపై పంచాయతీరాజ్ ఇంజినీర్లు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. కొద్దిరోజుల కిందట వేణుంబాక, కల్లూరు సచివాలయ భవనాల నిర్మాణ విషయమై అధికారుల వద్ద ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సిమెంటు పక్కదారి పట్టిన విషయమై వివాదం సైతం నెలకొంది. బిల్లులు రానప్పుడు తామేం చేయగలం.. సిమెంటును అమ్ముకున్నామని పలువురు తెలిపినట్లు తెలిసింది. ఇదే పరిస్థితి పలుచోట్ల జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీనిపై అధికారులు లోతుగా విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.
బిల్లులు ఆగడం లేదు
-బి.రమణయ్య, పీఆర్ డీఈ
సచివాలయ భవనాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి సిమెంటు సరఫరా చేసిన లెక్కలు మావద్ద ఉన్నాయి. వాటి ప్రకారం సంబంధిత గుత్తేదారు లెక్క చెప్పాల్సిందే. ప్రస్తుతం ఎక్కడా బిల్లులు ఆగడం లేదు. వెంటనే చెల్లిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..