సిఫార్సు దర్శనాలే అధికం
దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం వస్తుంటారు. ఇందులో సాధారణ, ప్రముఖులతో పాటు సిఫార్సు లేఖలపై దర్శనం కోసం వస్తారు.
సాధారణ భక్తులకు తప్పని కష్టాలు
వీఐపీ ద్వారం వద్ద వేచి ఉన్న ప్రముఖులు
కాణిపాకం, న్యూస్టుడే: దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం వస్తుంటారు. ఇందులో సాధారణ, ప్రముఖులతో పాటు సిఫార్సు లేఖలపై దర్శనం కోసం వస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సాధారణ భక్తుల కంటే సిఫార్సులపై వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా సాధారణ భక్తులకు స్వామి దర్శనానికి తిప్పలు తప్పడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాణిపాకం ఆలయానికి శని, ఆదివారాల్లో 15 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. వెయ్యి మందికి పైగా భక్తులు సిఫార్సులతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇందులో కేవలం వంద నుంచి రెండు వందల టికెట్లు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వారు ఉచితంగా దర్శనం చేసుకోవడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. సిఫార్సులతో వస్తున్న ప్రముఖులు స్వామివారిని నిమిషాల వ్యవధిలో దర్శనం చేసుకుంటుండగా... సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. గత వారం వీఐపీ ద్వారం వద్ద భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గేట్లను తోసుకొని భక్తులు వెళ్లడం గమనార్హం.
మూడు నెలల నుంచే అధికం...
అతిశీఘ్రం, శీఘ్ర, సాధారణ క్యూలైన్లలో భక్తులు వెళ్లి గతంలో స్వామివారిని దర్శించుకునేవారు. కొందరు దళారులు వారివారి దారుల్లో భక్తులకు తీసుకెళ్లేవారు. దీనిని అధిగమించేందుకు ఆలయ సమీపంలో మూడు నెలల క్రితం పీఆర్వో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనుమతి పొంది వీఐపీ ద్వారంలో స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా అదనపు క్యూలైన్ను ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
ఇబ్బందులు లేకుండా చర్యలు
సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటాం. సిఫార్సు దర్శనాలపై తగిన నిఘా ఉంచి, ప్రత్యేకంగా ఓ కమిటీని వేసి చర్యలు తీసుకొంటాం. వారం రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తాం
ఎ.మోహన్రెడ్డి, పాలకమండలి ఛైర్మన్, కాణిపాకం ఆలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!