అధికారం అండతో.. తరిమేశారు
జిల్లాలో తోతాపురి, బేనీషా రకాలతో పాటు ఇతర రకాల మామిడికాయల కోతలు ఊపందుకు న్నాయి.. అయితే ధరలు మాత్రం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి..
ఇష్టారాజ్యంగా ధరలు
మదనపడుతున్న మామిడి రైతు
ఓదార్పు ఇవ్వని అధికారుల ప్రకటనలు
చిత్తూరు మార్కెట్ యార్డుకు వచ్చిన తోతాపురి కాయలు
న్యూస్టుడే, చిత్తూరు(మిట్టూరు):జిల్లాలో తోతాపురి, బేనీషా రకాలతో పాటు ఇతర రకాల మామిడి కాయల కోతలు ఊపందుకు న్నాయి.. అయితే ధరలు మాత్రం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. దిగుబడులు తగ్గాయని, ఆశించిన ధర లభిస్తుందని సంబర పడిన వారి ఆశలు అడియాసలయ్యాయి.. అధికార పార్టీ నాయకుల అండతోనే ధరలు ఖరారవుతున్నాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెతున్నాయి.. ఏరోజు ఎంత ధర ఉంటుందో.. ధర ఎవరు నిర్ణయిస్తారో తెలియని పరిస్థితి.. కలెక్టర్ ప్రకటించిన మద్దతు ధర రైతులకు దక్కడం లేదంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది.. గుజ్జు పరిశ్రమలు నడుపుతున్న అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల ప్రమేయంతోనే జిల్లాలో మామిడి ధరలు నిత్యం ఖరారవు తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
పతనమవుతున్న బేనీషా..
తోతాపురి ధరలు హెచ్చుతగ్గుల నడుమ కొనసాగుతుండగా బేన్నీషా ధరలు మాత్రం పతనమవుతు న్నాయి. జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు తోతాపురి కాయల కొనుగోలు ప్రారంభించాయి. ఇవి టన్ను రూ.19వేలకే సేకరించాలని గత నెల 10న కలెక్టర్ ప్రకటించినప్పటికీ.. ఆ ధరతో ఎక్కడా కొనుగోలు జరగలేదు. తాజాగా ఈ నెల ఆరో తేదీన కలెక్టర్ మరోమారు వీటికి టన్ను రూ.15,500 మద్దతు ధర ప్రకటించారు. ఈ ధరను గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లించకపోవడం శోచనీయం. కొన్ని గుజ్జు పరిశ్రమలు తోతాపురి టన్ను రూ.14-15 వేలు చెల్లిస్తుండగా.. మరికొన్ని రూ.11-13 వేలే ఇస్తున్నాయని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు స్పందిస్తే తప్ప మామిడికి గిట్టు బాటు ధర దక్కే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మామిడి రైతులు తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సిందే.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని..
ఏటా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు సీజన్ మొదలు కాగానే చిత్తూరు, బంగారుపాళ్యం తదితర ప్రాంతాలకు చేరుకుని బేనీషా, తోతాపురి(లైన్ రకం కాయలు) కొనుగోలు చేసి ఎగుమతి చేస్తారు. వారు జిల్లాకు విచ్చేయడంతో మామిడికి డిమాండ్ పెరిగి రైతుకు మంచి ధర వచ్చేది. ఈ ఏడాది జిల్లాకు విచ్చేసిన ఇతర రాష్ట్రాల వ్యాపారులను.. జిల్లాకు చెందిన కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తరిమేసినట్లు సమాచారం. దీంతోనే ధరలు మరింత పతనానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు.
ధరలు ఇలా..
చిత్తూరు మార్కెట్ యార్డులో శుక్రవారం తోతాపురి టన్ను రూ.15-16 వేలు ఉంది. కలర్ తోతాపురి(లైన్) రూ.20 వేలు పలికింది. బేన్నీషా 15-20వేలు, కాదర్ రూ.35-40వేలు, మలగూబ రూ.55-60వేలు, కాలేపాడు రూ.40-45వేలు, పులేరా రూ.12-13 వేలు పలికాయి.* బంగారుపాళ్యం యార్డులో బేనీషా టన్ను రూ.20-24 వేలు, మలగూబా 50-60 వేలు, కాలేపాడు రూ.40-60వేలు పలికింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.