logo

బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు

కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్‌ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్‌ మెంబర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం.

Published : 29 Mar 2024 02:22 IST

బీసీ నాయకుడిపై దాడి

కేవీబీపురం: కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్‌ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్‌ మెంబర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. బాధితుడు హరిబాబు కథనం మేరకు వైకాపా మండల కన్వీనర్‌ గవర్ల కృష్ణయ్య, ఎంపీˆపీˆ భర్త నందకుమార్‌కు వ్యతిరేకంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడంతో గత 15 రోజులుగా హత్య చేసేందుకు కుట్రలు పన్నారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కేవీబీపురంలోని ఓ దుకాణంలో టీ తాగేందుకు వెళ్లిన సమయంలో మండల కోఆప్షన్‌మెంబర్‌ జాకీర్‌హుస్సేన్‌కు పూటుగా మందు తాగించి హరిబాబుపై దాడికి ఉసుగొల్పారు. జాకీర్‌హుస్సేన్‌ తన వెంట తెచ్చుకున్న రాయితో ఒక్కసారిగా హరిబాబు తలపై పలుమార్లు మోదడంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. స్థానికుల సహాయంతో హరిబాబు పీహెచ్‌సీˆకి వెళ్లి ప్రథమచికిత్స చేసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని