logo

తిరుమల నడకదారిలో చిరుత

అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు వెల్లడించారు.

Published : 29 Mar 2024 02:23 IST

తిరుమల, న్యూస్‌టుడే: అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు వెల్లడించారు. బాలిక లక్షితపై దాడి జరిగిన అనంతరం ఇప్పటికే ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బోన్లలో బంధించి అనంతరం వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. వాటిలో నాలుగో చిరుత చిన్నారిపై దాడిచేసి హతమార్చినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో చిరుత సంచారం కనిపించిన నేపథ్యంలో తితిదే అటవీశాఖ ఆధ్వర్యంలో భక్తులను గుంపులుగా పంపడం, చేతికర్రలు అందించడంతోపాటు సిబ్బందిని ఆ మార్గంలో భక్తుల భద్రతకు సాయంగా ఏర్పాటు చేసినట్లు డీఎఫ్‌వో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు