logo

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

రామచంద్రపురం ఒకటో వార్డు కొత్తూరులో తాళం వేసి ఉన్న ఇంట్లో మేడిశెట్టి దుర్గా ప్రసాద్‌ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.6.80 లక్షల నగదు, సుమారు రూ.లక్ష విలువ చేసే 6.5 కాసుల బంగారం అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం దుర్గా ప్రసాద్‌

Published : 20 Jan 2022 05:42 IST

రూ.7.8 లక్షల నగదు, బంగారం అపహరణ


ఘటన స్థలంలో వివరాలు తెలుసుకుంటున్న సీఐ శ్రీనివాస్‌

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం ఒకటో వార్డు కొత్తూరులో తాళం వేసి ఉన్న ఇంట్లో మేడిశెట్టి దుర్గా ప్రసాద్‌ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.6.80 లక్షల నగదు, సుమారు రూ.లక్ష విలువ చేసే 6.5 కాసుల బంగారం అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం దుర్గా ప్రసాద్‌ రామచంద్రపురంలో దుర్గా కన్సల్టెన్సీ పేరుతో పాత వాహనాల కొనుగోలు, అమ్మకం వ్యాపారం చేస్తారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా ఈ నెల 16న కుతుకులూరులోని అత్తారింటికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి వంట గదిపై పెంకులు తొలగించి ఉన్నాయి. బీరువా తెరచి ఉంది. అందులో దాచిన నగదు, బంగారం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌.ఐ ఎన్‌.వి.సత్యనారాయణలు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఐ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ సత్యనారాయణ తెలిపారు. సంఘటనా స్థలాన్ని క్లూస్‌ టీమ్‌ పరిశీలించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని