logo

24 గంటలు.. 816 కొవిడ్‌ కేసులు

గత24 గంటల్లో 816 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,99,987కి చేరింది. మొత్తంగా 2,94,024 మంది కోలుకోగా, ప్రస్తుతం 4,673 క్రియాశీలక కేసులున్నాయి. డీఎంహెచ్‌వోకు పాజిటివ్‌:జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ గౌరీశ్వరరావు

Published : 22 Jan 2022 05:23 IST

 

మసీదుసెంటర్‌: గత24 గంటల్లో 816 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,99,987కి చేరింది. మొత్తంగా 2,94,024 మంది కోలుకోగా, ప్రస్తుతం 4,673 క్రియాశీలక కేసులున్నాయి. డీఎంహెచ్‌వోకు పాజిటివ్‌:జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ గౌరీశ్వరరావుకు కరోనా సోకింది. ఆయన హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మీనాక్షి పర్యవేక్షిస్తున్నారు.

388 మందికి టీకాలు: జిల్లాలో 15-17 ఏళ్ల బాల బాలికలు 388 మందికి కొవిడ్‌ నివారణ టీకాలు వేశారు.3,863 మందికి ముందుజాగ్రత్త డోసులు వేశారు. రెండో డోసు 23,715 మందికి వేశారు.

ఒకే పాఠశాలలో 23 మందికి..: వరరామచంద్రాపురం: వీఆర్‌పురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, ఇతర సిబ్బందిలో 8 మందికి, విద్యార్థులు 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే పాఠశాలలో గురువారం ఓ ఉపాధ్యాయుడు కరోనా బారినపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని