కొత్త పాలన.. కొండంత వేదన
పునర్విభజన అనంతరం కొత్త జిల్లా ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా కలెక్టరేట్లోని ఆయా విభాగాలు, ఇక్కడ ఏర్పాటైన వివిధ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గందరగోళ పరిస్థితి ఇంకా తొలగలేదు. ఇంకా కొన్ని శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలు
న్యూస్టుడే, వి.ఎల్.పురం, ధవళేశ్వరం
జిల్లా హౌసింగ్ అధికారి కార్యాలయంలో అరకొర సిబ్బంది
పునర్విభజన అనంతరం కొత్త జిల్లా ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా కలెక్టరేట్లోని ఆయా విభాగాలు, ఇక్కడ ఏర్పాటైన వివిధ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గందరగోళ పరిస్థితి ఇంకా తొలగలేదు. ఇంకా కొన్ని శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. మరికొన్ని శాఖల కార్యాలయాలు మొక్కుబడిగా ఏర్పాటు చేశారే తప్ప పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగడంలేదు. ఇంకొన్ని కార్యాలయాలు అరకొర సిబ్బంది, సౌకర్యాల లేమి మధ్య కొనసాగుతున్నాయి. స్పందన రోజున మినహా మిగతా రోజుల్లో వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేవారేలేరు.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ బొమ్మూరు న్యాక్ భవనంలోని పైఅంతస్తులో ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఇక్కడి కలెక్టరేట్లోని పరిపాలన విభాగంతోపాటు కోఆర్డినేషన్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, మెజిస్టీరియల్ తదితర సెక్షన్లతోపాటు జిల్లా అర్ధగణాంకాధికారి(సీపీవో), రెవెన్యూ, వ్యవసాయం, హౌసింగ్, పౌర సరఫరాలు, సర్వే, భూమి రికార్డులు, హౌసింగ్ అధికారి కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మిగతా శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలకు సమీపంలోని గిరిజన యువత శిక్షణ కేంద్రం(వైటీసీ) భవనాన్ని కేటాయించినప్పటికీ ఇక్కడి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
వైటీసీ భవనంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి అధికారి కార్యాలయంలో కుర్చీ మినహా కనిపించని సౌకర్యాలు
ఇదీ పరిస్థితి...
* కొన్ని శాఖల కార్యాలయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. గదుల బయట బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కార్యాలయాలకు మాత్రం ఎప్పుడూ తాళాలు వేసి ఉంటున్నాయి. మరికొన్ని కార్యాలయాలు ఇరుకు గదులు, అరకొర సిబ్బంది, అసౌకర్యాల నడుమ మొక్కుబడిగా కొనసాగుతున్నాయి.
* ఆడిట్ శాఖ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ల కార్యాలయాలు ఇప్పటికీ రాలేదు.
* ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి అధికారి కార్యాలయానికి బయట బోర్డు, లోపల ఒక కుర్చీ తప్ప ఏమీలేవు. ఈ కార్యాలయం ప్రస్తుతం తాళం వేసి ఉంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం పరిస్థితి కూడా ఇంతే.
* అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి, డ్వామా పీడీ, మార్క్ఫెడ్ డీఎం, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్, జిల్లా పట్టుపరిశ్రమల శాఖ, ఏపీ సీడ్స్, నెడ్క్యాప్, మైక్రో ఇరిగేషన్, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసినా కొందరు కిందిస్థాయి సిబ్బంది తప్ప జిల్లాస్థాయి అధికారులు కన్పించడం లేదు. ఈ కార్యాలయాల్లో పరిపాలన స్తబ్దుగానే సాగుతోంది.
* న్యాక్ భవనంలో కొనసాగుతున్న కలెక్టరేట్లోని ఆయా విభాగాలు, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలకు కొంతవరకు సౌకర్యాలు సమకూర్చినప్పటికీ సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. పరిపాలన విభాగంలోని కార్యకలాపాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని అంశాలకు సంబంధించి కార్యకలాపాలు కాకినాడ నుంచే నిర్వహించే పరిస్థితి ఉంది.
తాళం వేసి ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం
సిబ్బంది అంతంతమాత్రమే...
* ఆయా శాఖల జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో వివిధ అభివృద్ధి పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
* జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో 12 మంది సిబ్బందికి గాను ఏడుగురే ఉన్నారు. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు ఆఫీసు సబార్డినేటర్ల అవసరం ఉంది.
* పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో ఎనిమిది మంది సిబ్బంది ఉండగా ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు అవసరం ఉంది.
* సీపీవో హౌసింగ్ కార్యాలయంలో సిబ్బంది అరకొరగా ఉండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
* వైటీసీ భవనంలో కొనసాగుతున్న కార్యాలయాల్లోనూ అదే పరిస్థితి. మైక్రోఇరిగేషన్ కార్యాలయంలో డీఎంఐవో, సూపరింటెండెంట్ తప్పా మిగతా అయిదుగురు ఔట్సోర్సింగ్ సిబ్బందే. ఇక్కడ రెండు కంప్యూటర్లు మాత్రమే ఉండగా అందులో ఒకటి పనిచేయడంలేదు. మరో రెండు కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్, ఫర్నీచర్ అవసరం ఉంది.
* జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలోనూ అదే పరిస్థితి. ఇక్కడ 11 మంది సిబ్బందికి ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు. పూర్తిగా సౌకర్యాలు ఇంకా సమకూరలేదు.
దశలవారీగా సౌకర్యాలు సమకూరుస్తున్నాం
- సుబ్బారావు, డీఆర్వో
కలెక్టరేట్లోని ఆయా విభాగాలు, వివిధ శాఖల జిల్లా కార్యాలయాలకు దశలవారీగా సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఇప్పటికే ఇక్కడి ఆయా విభాగాలతోపాటు పలు శాఖల కార్యాలయాలకు కుర్చీలు, టేబుల్స్, ర్యాక్లు కంప్యూటర్లు, బీరువాలు, ఫ్యాన్లు, ఏసీలు వంటివి ఏర్పాటు చేశాం. వైటీసీ భవనంలో కొనసాగుతున్న ఆయా శాఖల జిల్లా కార్యాలయాలకు కూడా ఒక్కొక్కటిగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. సిబ్బంది సమస్య ప్రస్తుతం ఏమీ లేదు. అవసరాన్ని బట్టి ఇక్కడి ఆయా విభాగాలకు మండలాల నుంచి డిప్యూటేషన్పై సిబ్బందిని తీసుకుంటున్నాం. బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లు తప్ప దాదాపు అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్