జిల్లా పాలన.. వసతులకు విజ్క్షాపన
ప్రజలకు పాలన సౌలభ్యం.. సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో కోనసీమ జిల్లా ఏర్పాటుచేసి మూడు నెలలు కావస్తోంది. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏప్రిల్ నాలుగో తేదీన యుద్ధ
న్యూస్టుడే, ముమ్మిడివరం, అమలాపురం పట్టణం, అల్లవరం
ప్రజలకు పాలన సౌలభ్యం.. సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో కోనసీమ జిల్లా ఏర్పాటుచేసి మూడు నెలలు కావస్తోంది. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏప్రిల్ నాలుగో తేదీన యుద్ధ ప్రాతిపదికన.. కార్యాలయాలను కొత్త జిల్లాలకు మార్చారు. కోనసీమ జిల్లాలో అమలాపురం కేంద్రంగా కలెక్టరేట్తోపాటు జిల్లా పోలీసు, ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయగా, ముమ్మిడివరంలోని ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పలు జిల్లాస్థాయి విభాగాల పరిపాలనా శాఖలను కొలువుదీర్చారు. కార్యాలయాల్లో సిబ్బంది విధుల నిర్వహణకు పూర్తి స్థాయిలో మౌలిక వసతుల్లేక.. పాలన ఇంకా కుదురుకోలేదు.
కలెక్టరేట్లో ఒకే గదిలోనే అన్ని సెక్షన్ల ఉద్యోగుల విధులు..
కొన్ని కార్యాలయాల్లో..
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ఐసీడీఎస్, జిల్లా పౌరసరఫరాల సంస్థ, పౌరసరఫరాల శాఖ, ఖజానా, విద్యాశాఖ, వ్యవసాయం, మత్స్యశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపక, పరిశ్రమల శాఖలు, ఏపీ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య, ఏపీఈడబ్ల్యూఐడీసీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో కొంతవరకు పాలన జరుగుతున్నా.. ఇంకా వసతులు కల్పించాల్సిఉంది. ఈ కార్యాలయాల్లో విభాగాధిపతులకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో ఫర్నిచర్ అందుబాటులో లేదు. దస్త్రాలు భద్రపర్చుకోవడానికి బీరువాలుసైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అటవీశాఖ కార్యాలయంలో ఇంకా కళాశాల జిమ్కు సంబంధించిన వస్తువులు మాత్రమే ఉన్నాయి. డీఆర్డీఏ కార్యాలయంలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ అందుబాటులోకి రాలేదు. సర్వే-భూరికార్డుల శాఖ కార్యాలయలోనూ ఇదే పరిస్థితి. ముమ్మిడివరం నుంచి జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి కార్యాలయాన్ని ఇటీవల అమలాపురానికి తరలించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ అమలాపురంలోని ఆ శాఖ ఈఈ కార్యాలయంలో, డ్వామా పీడీ అమలాపురంలోని మరో క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
డ్వామా కార్యాలయంలో రెండు కుర్చీల ఆసరాతో విధుల్లో ఏవో సత్యనారాయణ
నిధులు ఏవండి..?
కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులకు వసతుల్లేని తీరు..
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పాలన అందించడానికి ఏర్పాటుచేసే నూతన కార్యాలయాల ఏర్పాటు.. అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, కార్యాలయాల్లో క్యాబిన్లు, ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేయడానికి ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగాయి. ఇక్కడ పనులు చేసినా, నిధులు ఇంకా విడుదల కావాల్సిఉంది.
బోర్డులు ఏర్పాటు చేసి..
ఇంకా తెరుచుకోని షెడ్యూల్డు కులాలు, సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయం
భూగర్భ వనరులు, గృహ నిర్మాణం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, మార్క్ఫెడ్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, జిల్లా ఉపాధి కార్యాలయం, వయోజన విద్య, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ తదితర కార్యాలయాలకు బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఏ విధమైన పాలన జరగడం లేదు. ఈ కార్యాలయాల్లో నియమించిన సిబ్బందికి కనీసం కుర్చీలు కూడా లేని పరిస్థితి.
క్యాబిన్లలో కానరాని కంప్యూటర్లు..
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయంలో అసంపూర్తి ఏర్పాట్లు
సాంకేతిక వినియోగం పెరిగిన నేపధ్యంలో సమాచారమంతా కంప్యూటర్లలోనే నిక్షిప్తం అవుతోంది. ఆన్లైన్ విధానం, ఎప్పటికప్పుడు వివిధ పథకాలకు సంబంధించి పురోగతి, జీవోలు.. ఇలా ఏది కావాలన్నా కంప్యూటర్తోనే పని. చాలా కార్యాలయాల్లో కంప్యూటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన క్యాబిన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) కార్యాలయంలో ఫర్నిచర్ లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
అమలాపురంలో..
అమలాపురంలోని కలెక్టరేట్లో వివిధ సెక్షన్ల కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్లో అన్ని సెక్షన్ల ఉద్యోగులు ఒకే గదిలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి, పరిపాలనాధికారి ఛాంబర్లు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు సరైన వసతుల్లేవు. భవనం బయటకూర్చుని అర్జీలు పూర్తి చేస్తున్నారు. తాగునీటికి సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లు మినహా శాశ్వత ఏర్పాట్లు కనిపించడం లేదు. జిల్లా ప్రజారోగ్య సాంకేతికశాఖ కార్యాలయంలో ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కనీస వసతులు కనిపించడంలేదు. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో పాములు చేరుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. పెద్ద పాము తిరగడం చూశామని, తమకు భయంగా ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సామగ్రి సమకూరుస్తున్నాం..
- హిమాన్షుశుక్లా, కలెక్టర్
కోనసీమ జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు రూ.50లక్షల నిధులతో సామగ్రి, కంప్యూటర్లు సమకూర్చి, పనులు పూర్తి చేయిస్తున్నాం. ఏమైనా లోటుపాట్లుంటే ఈ వారంలో సమీక్ష సమావేశం నిర్వహించి మిగిలిన సదుపాయాలు కల్పిస్తాం. అమలాపురం కలెక్టరేట్లో వివిధ సెక్షన్ల కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా