భవిత..ప్రశ్నార్థకం?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సమగ్రశిక్ష పథకంలో సహిత విద్యావిభాగం కాకినాడ కేంద్రంగా ఒక్కటిగానే కొనసాగిస్తున్నారు. మానసిక, శారీరక వైకల్యంతో పుట్టిన పిల్లలను సాధారణ విద్యార్థుల మాదిరి తీర్చిదిద్దేలా ‘భవిత’ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
బిక్కవోలు కేంద్రానికి ట్రైసైకిల్పై తీసుకొస్తున్న కుటుంబసభ్యులు
న్యూస్టుడే, సీతానగరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సమగ్రశిక్ష పథకంలో సహిత విద్యావిభాగం కాకినాడ కేంద్రంగా ఒక్కటిగానే కొనసాగిస్తున్నారు. మానసిక, శారీరక వైకల్యంతో పుట్టిన పిల్లలను సాధారణ విద్యార్థుల మాదిరి తీర్చిదిద్దేలా ‘భవిత’ కేంద్రాలను ఏర్పాటుచేశారు. గత రెండేళ్లుగా నిధుల లేమితో ఇవి నిర్వీర్యం అయ్యాయి. కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఇచ్చే పోషక నగదు ఇవ్వడం లేదు. పిల్లలకు సమీప పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తెచ్చి పెట్టే రవాణా ఛార్జీలూ లేవు. వేతనాలు లేక ఆయాలు పని మానేశారు. వెరసి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన దయనీయమిది.
ఎలాగంటే..
మానసిక, శారీరక వైకల్య పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్చాలి. వీరికి నెలకు రవాణా ఛార్జీలు రూ.300, ఎస్కార్ట్ అలవెన్సు రూ.300 ఇవ్వాలి. పిల్లలను వేర్వేరు గ్రామాల నుంచి తెచ్చే తల్లిదండ్రుల ఖాతాల్లో నగదు జమచేయాలి. మండల కేంద్రంలో భవిత కేంద్రానికి కొందరు 20-25 కి.మీ. నుంచి ప్రయాసలతో పిల్లలను తెస్తారు. బాలికలకు నెలకు రూ.200 స్టయిఫండ్ ఇవ్వాలి. కేంద్రాలకు రాలేని పిల్లల ఇళ్లకు ప్రతి శనివారం ఐఈఆర్టీ వెళ్లి బోధించాలి. వీరికి రూ.300 ఇవ్వాలి. అంధ పిల్లలకు బోధించే సహాయకులకు రూ.300 ఇవ్వాలి. సహిత విద్య అయిదు విభాగాల్లో అందించే ఈ సేవలకు రెండేళ్లుగా పైసా రాక.. రూ.77.65 లక్షల బకాయిలు పేరుకున్నాయి.
ఫిజియోథెరపీ అంతంతే..
64 కేంద్రాల్లో 21 మంది ఫిజియోథెరపిస్టులను నియమిస్తే... ఉమ్మడి జిల్లాలో 14 మంది మిగిలారు. ప్రతి కేంద్రంలో వారానికో ఒక శిబిరం పెట్టాలి. ఫిజియోథెరపిస్టుకు రూ.950 ఇవ్వాలి. నెలలో నాలుగు శిబిరాలు తప్పనిసరి. వీరికి కూడా వేతనాలు రాక శిబిరాలు మొక్కుబడిగా మారాయి. ఒక్కో ఆయాకు నెలకు రూ.6,000 మేర ఏడాదిగా రాలేదు. రెండేళ్ల కిందట కరోనా వేళ కేంద్రాలు తెరవకపోయినా వేతనాలు తీసుకున్నారని వాటిని గతేడాదికి సర్దుబాటు చేయడంతో రెండు నెలల వేతనాలే ఆయాలకు వస్తాయని అధికారులు చెప్పడంతో వారు పని మానేశారు.అసలు విషయం చెప్పకుండా ఆయాలు సెలవుల్లో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడంతో భవిత కేంద్రాల పర్యవేక్షణను ఎంఈవోలు, సీఆర్పీలకు అప్పగించారు.
తీసుకురాలేకపోతున్నాం
ఒక్కడే బిడ్డ. పిల్లాడికి ఆరేళ్లు. మెదడులో లోపంతో మానసికంగా బాధపడుతున్నాడు. దీనికితోడు ఫిట్స్. నెలకు రూ.2 వేలకు పైగా మందులకు వెచ్చిస్తున్నాం. నా భర్త వ్యవసాయ కూలీ. 13 కి.మీ. దూరంలో భవిత కేంద్రానికి బిడ్డను తేవడానికి అష్టకష్టాలు పడుతున్నాం. రవాణా ఛార్జీలు, ఎస్కార్ట్ అలవెన్సులు రావడం లేదు. అడిగితే పలికే వారే లేరు. బస్సులు, ఆటోలు పట్టుకుని వస్తున్నాం. కొన్నిసార్లు వాహనాలు దొరక్క బిడ్డను ఎత్తుకుని తీసుకొస్తున్నాం. వైకల్య పరీక్షలు చేయలేదు. ఒక్క పరికరమూ ఇవ్వలేదు. - జి.శైలజ, వంగలపూడి
పరికరాలు రావండి...
పిల్లలకు అవసరమైన పరికరాలు ఆరునెలలకు ఒకసారి ఇవ్వాలి. ప్రధానంగా సేఫ్టీఛైర్, ట్రైసైకిళ్లు, వాకర్స్, క్లచ్ఛర్స్, ఎంఆర్ కిట్స్, బధిరత్వాన్ని, మూగ అధిగమించే 12 రకాల పరికరాలు ఇవ్వాలి. గతంలో ఆట వస్తువులు ఇచ్చేవారు. రెండేళ్లుగా ఒక్క పరికరమూ లేదు. ఇప్పటికే ఇచ్చినవన్నీ పాడయ్యాయి. కొత్తవి కొనేందుకు తల్లిదండ్రులకు స్థోమత లేదు. ఇప్పటికే పిల్లలకు మందులుకొని.. రాను పోనూ ఛార్జీలు భరించడం కష్టంగా మారిందంటున్నారు.
నిధులు రాగానే చెల్లిస్తాం..
భవిత కేంద్రాల్లో ఉండే పిల్లలతో పాటు బయట ఉండే వారికి ఇవ్వాల్సిన సొమ్ముకు అవసరమైన బిల్లులు పెట్టాం. బడ్జెట్ రాగానే తల్లుల ఖాతాల్లో వేస్తాం. అవసరమైన పరికరాలు ఇచ్చేలా నివేదికలు పంపించాం. అన్నిచోట్ల ఫిజియోథెరపీ శిబిరాలు నిర్వహిస్తాం. భవిత కేంద్రాలకు దగ్గరుండే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వీరికి అమలుచేస్తున్నాం. - జె.స్నేహలత, సహిత విద్యావిభాగం, ఉమ్మడి జిల్లా
కాకినాడ అర్బన్లో కేంద్రానికి ఆటోలో చేరుతున్న విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్