ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీలపై ఇదో ఆర్థిక భారమంటున్న సర్పంచులు
కడియం, ధవళేశ్వరం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్లో రూ.3వేలు పలికే వీల్ఛైర్లకు రూ.5 వేలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) డి.రాంబాబు ఆదేశాలిచ్చారని పేర్కొంటున్నారు. కేంద్రాల వద్ద పాతవి ఉన్నా లేకున్నా కొత్తవి కొనుగోలు చేయాలని సూచించారని వారు ఆరోపిస్తున్నారు. కడియం ఎంపీడీవో కార్యాలయం వద్ద సిద్ధం చేసిన వీల్ఛైర్లను కొనుగోలు చేసి బిల్లులు చెల్లించాలని చెబుతున్నారన్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి జేగురుపాడు సర్పంచి యాదల సతీశ్చంద్ర తీసుకెళ్లగా వీల్ఛైర్లు ఎక్కడైనా తక్కువ ధరకు అందుబాటులో ఉంటే పంచాయతీలు వాటిని కొనుగోలు చేసుకోవచ్చన్నట్లు తెలిపారన్నారు. అవసరం ఉన్నంత మేరకు మాత్రమే వాటిని కొనుగోలు చేయాలని సూచించారని వివరించారు.
ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు...
- జిల్లా పంచాయతీ అధికారి, రాంబాబు
పోలింగ్ కేంద్రాలలో వీల్ఛైర్లు కొనుగోలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఆదేశాలు జారీ చేశాం. ఒక్కో కేంద్రానికి ఒక వీల్ఛైర్ని రూ. 5 వేలలోపు ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నాం. పంచాయతీలలో అవకతవకలపై తనిఖీలు చేస్తున్నాం. అధిక ధర చెల్లించాలని డిమాండు చేయడం అవాస్తవం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
[ 04-05-2024]
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. -
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
[ 04-05-2024]
సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. -
జనం భూముల్లో.. జగన్ బూచోడు
[ 04-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. -
వైకాపా వంచన.. అభాగ్యుల వేదన
[ 04-05-2024]
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..
[ 04-05-2024]
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. -
వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు
[ 04-05-2024]
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. -
వేమగిరి.. మోగనుంది విజయ శంఖారావం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేడు
[ 04-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
[ 04-05-2024]
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ప్రజలదే: యనమల
[ 04-05-2024]
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది సాధ్యమని తెదేపా పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..
[ 04-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. -
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైకాపా లక్ష్యం
[ 04-05-2024]
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. -
చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’
[ 04-05-2024]
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. -
గోరంట్ల ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు
[ 04-05-2024]
రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. -
రెండు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటారా?
[ 04-05-2024]
రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..