సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది.
అయిదేళ్లుగా సంక్షోభంలో తాడితోట వస్త్రమార్కెట్
న్యూస్టుడే, వి.ఎల్.పురం
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. కొవిడ్ నుంచి మరింతగా కుదేలైన వ్యాపారులు నేటికీ తేరుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు. నిర్వహణ భారంతో ఇప్పటికే కొందరు దుకాణాలను మూసివేశారు. ఏటా రూ.కోట్లలోనే వివిధ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వపరంగా గత అయిదేళ్లుగా ఎటువంటి సహకారం లేదు. మార్కెట్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. పారిశుద్ధ్యం నుంచి వీధిదీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా వరకు అంతా వ్యాపారులే నిర్వహించుకుంటున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. బెంగళూర్, దిల్లీ, ముంబయి, సూరత్, అహ్మదాబాద్, జబల్పూర్, తిరుపూర్, బెనారస్ తదితర ప్రాంతాల నుంచి వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులను కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారులు విక్రయించుకునేవారు. గతంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచేగాక విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజూ పదివేల మంది వినియోగదారులు వచ్చి కొనుగోలు చేసేవారు. రవాణా ఛార్జీలు పెరిగిపోవడం, మాల్స్, ఆన్లైన్ వ్యాపారం పెరగడం వంటి వాటి కారణంగా వీరిసంఖ్య క్రమేణా తగ్గిపోయింది.
పలు దుకాణాల మూత
ప్రస్తుతం మహాత్మాగాంధీ క్లాత్ కాంప్లెక్సులో 25 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో రూ.25 వేలు అద్దె అయినా దుకాణం దొరకని పరిస్థితి ఉండగా ఇప్పుడు రూ.10 వేలకు కూడా ఎవరూ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మరికొందరు సిబ్బందిని తగ్గించుకుని దుకాణాలు నడుపుతున్నారు.
క్లాత్ కాంప్లెక్సులో నిర్వహణ భారంతో మూతపడిన దుకాణాలు
ఇదీ పరిస్థితి
పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ, రోడ్ల మర్మమతులు వంటివి నగరపాలక సంస్థ పట్టించుకోవడం లేదని, అసోసియేషన్ తరఫున తామే అన్నీ చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
తూర్పు, పడమర ముఖద్వారాల వైపు నుంచి ఉన్న ప్రధాన డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. పూడికతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు మురుగునీరు పొంగి కాంప్లెక్సులోకి వచ్చేస్తుండటంతో వ్యాపారులు, సిబ్బంది, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎంజీడబ్ల్యూఎస్ బయట ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు ప్రధాన రహదారిపై చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.
మార్కెట్లోకి ప్రవేశించే ప్రధాన రహదారిలో రాత్రివేళ భద్రత లేకుండా పోతుందని పలువురు జట్ల కార్మికులు, వినియోగదారులు చెబుతున్నారు. బ్లేడ్, గంజాయి బ్యాచ్లు తిష్ఠవేసి బెదిరింపులకు గురిచేసి పలువురి నుంచి డబ్బులు లాక్కొని పోతున్న సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.
తూర్పు మార్గంలో డ్రెయిన్ దుస్థితి
పన్నులు పెంచుకుంటూ పోతున్నారు
- కాలెపు రామచంద్రరావు, ది రాజమహేంద్రవరం హోల్సేల్ క్లాత్మార్కెట్ కమిటీ, తాడితోట
ఇక్కడి మార్కెట్లో ఒకపక్క వ్యాపారాలు తగ్గిపోయాయి. మరోపక్క నిర్వహణ భారం పెరిగిపోయి వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. పన్నులు కూడా ఏటా 15 శాతం పెంచుకుంటూ పోతుండటం మరింత భారంగా మారింది. పన్ను చెల్లిస్తున్నప్పటికీ కనీసం పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ నగరపాలక సంస్థ చేపట్టడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా సహకారం అందించాలి.
చెత్తపన్ను వేయడం దారుణం
- కె.రాధాకృష్ణమూర్తి, హోల్సేల్ వస్త్రవ్యాపారి
వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న తాడితోట క్లాత్ మార్కెట్లోని వ్యాపారులకు ప్రభుత్వపరంగా వెసులుబాటు కల్పించాలి. పన్నుల భారం తగ్గించి ఆదుకోవాలి. నగరపాలక సంస్థ తరఫున మార్కెట్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. భారమంతా వ్యాపారులపై మోపడం సరికాదు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టకుండానే నగరపాలక సంస్థ చెత్తపన్ను వేయడం దారుణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
[ 04-05-2024]
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. -
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
[ 04-05-2024]
సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. -
జనం భూముల్లో.. జగన్ బూచోడు
[ 04-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. -
వైకాపా వంచన.. అభాగ్యుల వేదన
[ 04-05-2024]
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..
[ 04-05-2024]
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. -
వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు
[ 04-05-2024]
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. -
వేమగిరి.. మోగనుంది విజయ శంఖారావం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేడు
[ 04-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
[ 04-05-2024]
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ప్రజలదే: యనమల
[ 04-05-2024]
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది సాధ్యమని తెదేపా పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..
[ 04-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. -
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైకాపా లక్ష్యం
[ 04-05-2024]
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. -
చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’
[ 04-05-2024]
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. -
గోరంట్ల ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు
[ 04-05-2024]
రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. -
రెండు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటారా?
[ 04-05-2024]
రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!