జగన్.. మాపై ఎందుకింత కక్ష?
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది.
పునాది దశలో నిలిచిపోయిన కాపు సామాజిక భవనాలు
న్యూస్టుడే, పిఠాపురం
చిత్రాడలో పునాది దశలో నిలిచిన కాపు కల్యాణ మండపం
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ కాపులకు ఎన్నో హామీలు ఇచ్చినా.. అమలుకు నోచుకోలేదు. ఏటా రూ.2వేల కోట్లు చొప్పున అయిదేళ్లలో రూ.10వేల కోట్లు ఖరు చేస్తాననని హామీ ఇచ్చినా.. మాట నిలబెట్టుకోలేదు. గ్రామాల్లో కాపుల కోసం గత ఎన్నికల్లో నిర్మించ తలపెట్టిన కాపు సామాజిక భవనాలన్నీ జిల్లాలోని పలుచోట్ల పునాది దశలోనే నిలిచిపోయాయి. నిధులు ఆపేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇదీ పరిస్థితి..
తెదేపా హయాంలో కాపు సామాజిక భవనాల నిర్మాణానికి పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చేశారు. 2018లో వీటి నిర్మాణానానికి శంకుస్థాపనలు చేయగా, ప్రభుత్వం దిగిపోయే సమయానికి పునాది దశలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాల ఆధ్వర్యంలో రూ.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.25 లక్షలతో వీటి నిర్మాణాలు ప్రారంభించారు. స్థలాలు సేకరణ ఇబ్బందిగా ఉండి నిర్మాణ పనులు అప్పట్లో ఆలస్యంగా మొదలయ్యాయి. పలుచోట్ల ఆరునెలల కాలంలో పునాది దశ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 2019 మార్చిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నిధులు ఆగిపోవడంతో గుత్తేదారులు పనులు నిలుపుదల చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులు అటకెక్కాయి. నిధులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు చేతులు ఎత్తేశారు.
పనులు మొదలుకాలే..
పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతోపాటు, ఇతర మండలాల్లో కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈ సామాజిక భవనాలు నిర్మించేందుకు నిర్ణయించారు. పిఠాపురం పట్టణంతోపాటు, మండలంలో చిత్రాడ, కందరాడ, విరవ, విరవాడ, కోలంక, రాపర్తి, వెల్దుర్తి, పి.దొంతమూరు, పి.రాయవరం గ్రామాలకు రూ.25 లక్షలు చొప్పున కేటాయించారు. పి.రాయవరంలో మంజూరైన భవనాన్ని తర్వాత వివిధ కారణాలతో రద్దు చేశారు. మిగిలిన చోట్ల పనులు పునాది దశలో ఉండిపోయాయి. గొల్లప్రోలు నగర పంచాయతీతోపాటు, మండలంలోని దుర్గాడ, తాటిపర్తి, చేబ్రోలులో శంకుస్థాపనలు జరగగా, చేబ్రోలు, పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో స్థలం కేటాయించి శంకుస్థాపనలు చేశారు తప్పితే, పనులు మొదలు పెట్టలేదు.
మాట ఇచ్చి మోసం..
-కొండేపూడి సూర్యప్రకాష్, పిఠాపురం
వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపుల సంక్షేమాన్ని విస్మరించారు. కాపు కార్పొరేషన్ ఉనికిలేకుండా పోయింది. తెదేపా హయాంలో పిఠాపురం పట్టణంలో సుమారు అర ఎకరం కేటాయించి కాపు కల్యాణ మండపానికి రూ.50 లక్షలు నిధులు నిలుపుదల చేశారు. వైకాపా నాయకులు అయిదేళ్లుగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నారు. ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
తగిన సమాధానం చెబుతాం..
-అడ్డగర్ల శివ, చిత్రాడ
నియోజకవర్గంలో కాపు కల్యాణ మండపాలకు తెదేపా హయాంలో నిధులు మంజూరయ్యాయి. అన్నిచోట్లా పనులు పునాది దశ వరకు వచ్చాయి. గ్రామాల్లో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు మొదలయ్యాయి. గుత్తేదారులకు నిధులు చెల్లించక పనులు చేపట్టలేదు. వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే భవనాలు పూర్తి కాలేదు. రాబోయే ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములను దోచే ప్రమాదం
[ 04-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు ప్రజల భూములను దోచేసే ప్రమాదముందని ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
[ 04-05-2024]
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. -
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
[ 04-05-2024]
సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. -
జనం భూముల్లో.. జగన్ బూచోడు
[ 04-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. -
వైకాపా వంచన.. అభాగ్యుల వేదన
[ 04-05-2024]
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..
[ 04-05-2024]
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. -
వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు
[ 04-05-2024]
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. -
వేమగిరి.. మోగనుంది విజయ శంఖారావం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేడు
[ 04-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
[ 04-05-2024]
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ప్రజలదే: యనమల
[ 04-05-2024]
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది సాధ్యమని తెదేపా పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..
[ 04-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. -
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైకాపా లక్ష్యం
[ 04-05-2024]
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. -
చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’
[ 04-05-2024]
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. -
గోరంట్ల ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు
[ 04-05-2024]
రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. -
రెండు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటారా?
[ 04-05-2024]
రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన