మెరుగైన జీవన శైలితోసంపూర్ణ ఆరోగ్యం
మెరుగైన జీవన శైలి, క్రమశిక్షణ కలిగిన ఆహార అలవాట్లతో రోగాలకు దూరంగా ఆరోగ్యంతో జీవించవచ్చని వైద్యులు బిట్రా అశోక్కుమార్, ఎం.రాజ్యలక్ష్మి సూచించారు. రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్డులో గల ఏకేసీ రోటరీ రివర్ సిటీ హాలులో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో శనివారం గుండె సంబంధిత, బీపీ, కొవిడ్ అనంతర అనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
‘ఈనాడు-ఈటీవీ’ అవగాహన సదస్సులో వక్తలు
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
సూచనలిస్తున్న డాక్టర్ రాజ్యలక్ష్మి, వేదికపై డాక్టర్ అశోక్ కుమార్, ఈనాడు యూనిట్ ఇన్ఛార్జి చంద్రశేఖర్ప్రసాద్
మెరుగైన జీవన శైలి, క్రమశిక్షణ కలిగిన ఆహార అలవాట్లతో రోగాలకు దూరంగా ఆరోగ్యంతో జీవించవచ్చని వైద్యులు బిట్రా అశోక్కుమార్, ఎం.రాజ్యలక్ష్మి సూచించారు. రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్డులో గల ఏకేసీ రోటరీ రివర్ సిటీ హాలులో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో శనివారం గుండె సంబంధిత, బీపీ, కొవిడ్ అనంతర అనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ‘ఈనాడు’ యూనిట్ ఇన్ఛార్జి చంద్రశేఖర్ప్రసాద్ సదస్సు ప్రారంభించారు. వైద్యులు పవర్ పాయింట్ ప్రజటేషన్ ద్వారా సూచనలు చేశారు. గుండె, బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు, వచ్చిన తరువాత ఉండే లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను వివరించారు. సదస్సు అనంతరం ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
అప్రమత్తతే శ్రీరామరక్ష
కొవిడ్ తరువాత చాలామందిలో ఆరోగ్య సమస్యలొస్తున్నాయని, ఎక్కువగా నరాలు, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ తదితర అవయువాలపై ప్రభావం చూపుతోందని వైద్యురాలు ఎం.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కొవిడ్ అనంతరం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైద్యుడిని సంప్రదించాలన్నారు. స్థూలకాయం, గుండె సమస్యలు, బీపీ, మధుమేహం ఉన్నవారిలో రెండు వారాల కంటే అధికంగా వైరస్ లక్షణాలుంటాయన్నారు. కొవిడ్ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువని, తీవ్రమైన తలనొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు.
సదస్సుకు హాజరైన ప్రజలు
వ్యాయామంతో గుండె జబ్బులు దూరం
నిరంతర వ్యాయామంతో గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చని వైద్యుడు బి.అశోక్కుమార్ తెలిపారు. ప్రస్తుతం అన్ని వయసుల వారికీ గుండె సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పొగ తాగడం పూర్తిగా ఆపేయకపోతే గుండెలో పంపింగ్ వ్యవస్థలో బ్లాకులు ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదముందన్నారు. ఒకసారి గుండె పోటు వచ్చినవారు నిరంతరం పరీక్షలు చేయించుకుని వైద్యుడి సూచనల మేరకు ఏరోబిక్ కసరత్తులు చేస్తే మంచిదన్నారు. సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు ప్రొటీన్లు, విటమిన్లు తగినన్ని ఉండేలా చూసుకోవాలన్నారు. పొట్టపైనుంచి తల వరకు ఏ ప్రాంతంలో అధికంగా నొప్పి, భారంగా.. ఆయాసంగా ఉంటే గుండె నొప్పిగా భావించవచ్చన్నారు. ఒత్తిడితో బీపీ పెరిగితే రక్తం గడ్డకట్టి సరఫరా సక్రమంగా లేక గుండె ఆగిపోయే ప్రమాదముందన్నారు. మధుమేహం ఉన్నవారికి గుండె సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందన్నారు. మహిళల కన్నా పురుషుల్లో హార్ట్ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువన్నారు.
ఎంతో ఉపయుక్తం
‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అనేక విషయాలు తెలుసుకున్నాం. కొవిడ్ అనంతరం వస్తున్న సమస్యలు, వ్యాధి ముదరకముందే వాటి నుంచి ఎలా బయట పడాలో వంటివి తెలుసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. తెరపై అవయవాల బొమ్మలను చూపిస్తూ వైద్యులు గుండె, కొవిడ్ అనంతరం వచ్చే ఇబ్బందుల గురించి వివరించడం ద్వారా బాగా అవగాహన ఏర్పడింది.
-జీఎన్ మూర్తి, రాజమహేంద్రవరం
అవగాహన అభినందనీయం
యాభై ఏళ్లు దాటిన వారికి అధికంగా వచ్చే గుండె సమస్యలపై నిపుణులతో అవగాహన కల్పించడం అభినందనీయం. గుండె నొప్పి ఎలాంటప్పుడు వస్తుంది.. కారణాలు.. దాని లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను చక్కగా వివరించారు. ఒకప్పుడు గుండె నొప్పి ఉన్నవారు కసరత్తులు చేస్తే మళ్లీ స్ట్రోక్ వస్తుందేమోననే అపోహ ఉండేది. ప్రస్తుతం అది తొలగిపోయింది. బరువులు ఎత్తే వ్యాయామం మినహా అన్ని రకాల కసరత్తులు చేసుకోవచ్చని వైద్యులు వివరించారు.
-చంద్రబోసు, నిడదవోలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక