ముద్దచర్మ వ్యాధిపై ఆందోళన వద్దు
పాడి రైతులను ముద్ద చర్మ (లంపి స్కిన్) వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. ఆవులు, గేదెలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్ర జ్వరానికి లోనవుతాయి.
పశుసంవర్థక శాఖ జేడీ సూర్యప్రకాశరావు
కాకినాడ నగరం, పెద్దాపురం: పాడి రైతులను ముద్ద చర్మ (లంపి స్కిన్) వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. ఆవులు, గేదెలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్ర జ్వరానికి లోనవుతాయి. ఆహారం తినడం మానేస్తాయి. దీంతో పాల ఉత్పత్తి తగ్గిపోవడంతోపాటు ఒక్కోసారి పశువులు తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యాధి తీవ్రత, నివారణకు తీసుకుంటున్న చర్యలపై కాకినాడ జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ ఎస్.సూర్యప్రకాశరావుతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి చేసింది.
న్యూస్టుడే: వ్యాధి తీవ్రత ఎలా ఉంది?
జేడీ: ఈ వ్యాధి లక్షణాలను పశువుల్లో మొదటిగా ఉత్తరభారత దేశంలోని రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో గుర్తించారు. మన రాష్ట్రానికి సంబంధించి విజయనగరంలో 4, శ్రీకాకుళంలో 2, విశాఖ జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా తెల్ల ఆవుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఎలా వ్యాప్తి చెందుతుంది..?
వ్యాధి సోకిన పశువులపై వాలిన ఈగలు, దోమలు, జోరీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే కొత్తగా పశువులను కొనుగోలు చేయకుండా కట్టడి చేశాం.
లంపి స్కిన్కు వ్యాక్సిన్ వేస్తున్న పశువైద్య అధికారులు
వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన తక్షణ నివారణ చర్యలేంటీ?
ముద్ద చర్మ వ్యాధి సోకిన పశువులకు విపరీతంగా జ్వరం వస్తుంది. శరీరం, పొదుగుపై బొమ్మలు (పొక్కులు), కళ్లు, ముక్కు నుంచి ద్రవాలు వస్తాయి. పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి సోకిన పశువు చర్మంపై పసుపు, వేప నూనె కలిపి రాయాలి. సమీపంలో ఉన్న ఆర్బీకేల్లో పశువైద్య సహాయకులను కలిసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా?
ప్రస్తుతం జిల్లాలో 65 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 65 శాతం పశువులకు వేశాం. వ్యాక్సిన్లు కోసం సమీప ఆర్బీకేల్లో పశువైద్య సహాయకులు, పశువైద్య ఆసుపత్రుల్లో సంప్రదించాలి.
నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు ఏంటి?
వ్యాధి సంక్రమించకుండా జిల్లాలో ముందు జాగ్రత్తగా పశు సంతలు మూయించి వేశాం. ఇతర జిల్లాల పశువులు రానీయకుండా ప్రత్యేకంగా చెక్ పోస్టులు పెట్టి కట్టడి చేస్తున్నాం. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ, ఆర్డీవోలు, డీపీవో, మార్కెటింగ్ శాఖ ఏడీ, పశుసంవర్థక శాఖ జేడీ, డీడీలతో పర్యవేక్షక కమిటీని నియమించారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు వ్యాధి పరిస్థితిపై పర్యవేక్షిస్తోంది. మండలానికి రెండు బృందాల చొప్పున 42 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ నియమించారు. ఒక్కో బృందంలో ఒక పశు వైద్యుడు, అయిదుగురు పశు వైద్య సహాయకులు, ఒక పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. వీరంతా గ్రామాల్లో పర్యటించి వ్యాధిపై అవగాహన కల్పించటంతో పాటు చికిత్సకు చర్యలు తీసుకుంటారు.
జిల్లాలో పాల ఉత్పత్తి, ధరల పరిస్థితి ఎలా ఉంది?
జిల్లాలో రోజుకు 1.50 లక్షల నుంచి 1.60 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి వస్తోంది. ఇందులో స్థానిక వినియోగం పోను లక్ష లీటర్లకు పైగా జగనన్న పాల వెల్లువ, ఇతర కేంద్రాలకు విక్రయిస్తున్నారు. 11 శాతం వెన్న ఉన్న పాల ధర లీటరు రూ.84 చొప్పున ఆమూల్ సంస్థ కొనుగోలు చేస్తోంది. దీంతో మిగతా డెయిరీ సంస్థలు కూడా అవే ధరలకు పాలను కొనుగోలు చేయటంతో రైతులకు గిట్టుబాటు అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!