మహిళల ఆర్థిక స్వావలంబనకు రూ.2 వేల కోట్లు
జిల్లాలోని గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి చెప్పారు. ఈ ఏడాది రూ.2 వేల కోట్ల రుణాలు అందించి ఆర్థికంగా వారిని పరిపుష్టి చేయడమే లక్ష్యమన్నారు.
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలోని గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి చెప్పారు. ఈ ఏడాది రూ.2 వేల కోట్ల రుణాలు అందించి ఆర్థికంగా వారిని పరిపుష్టి చేయడమే లక్ష్యమన్నారు. అర్హత ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల కల్పనతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా సమకూరే లబ్ధితో జీవనోపాధులు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి మహిళ నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం పొందేలా ఏర్పాట్లు చేస్తున్నామని, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో పట్టాలు పొందిన సంఘాల సభ్యులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. సుమారు రూ.50 లక్షల పెట్టుబడితో మాల్స్ ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలోని 40 వేల డ్వాక్రా సంఘాల్లోని 80 వేల మంది గ్రామీణ మహిళలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే పథకాలు, ప్రగతిపై డీఆర్డీఏ పీడీ శ్రీరమణి ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో వెల్లడించారు.
టీపొడి, కారం వ్యాపారం చేస్తున్న సామర్లకోట మండల మహిళా సమాఖ్య
న్యూస్టుడే: బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాలు ఎప్పటికి పూర్తి చేస్తారు?
డీఆర్డీఏ పీడీ : ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.1,000 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు కల్పించాలని లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు 10,432 సంఘాలకు రూ.650 కోట్ల మేర రుణాలు అందించాం. నాలుగు నెలల్లో లక్ష్యాన్ని అధిగమిస్తాం. ఈ రుణాలు స్వయం ఉపాధికి వినియోగించేలా క్షేత్రస్థాయిలో చైతన్యం తీసుకొస్తున్నాం.
మహిళా మార్ట్లను ఏవిధంగా తీర్చిదిద్దుతారు..?
మహిళల పొదుపు చేసిన డబ్బుల్లో కొంత మొత్తంతో కార్పొరేట్ సంస్థల స్థాయిలో మార్ట్లను ఏర్పాటు చేస్తున్నాం. రూ.50 లక్షలు పెట్టుబడి నిధితో వీటిని నెలకొల్పుతున్నాం. ఇప్పటికే ఉప్పాడతో ఏర్పాటు చేశాం. త్వరలో తొండంగి మండలం, ఎ.కొత్తపల్లి, తాళ్లరేవులో వీటిని ఏర్పాటు చేయనున్నాం. వీటిని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
జగనన్న కాలనీల్లో స్థలాలు పొందినవారికి ఎప్పటిలోగా రుణాలు అందిస్తారు?
జిల్లాలో 35 వేల మంది డ్వాక్రా మహిళలకు పట్టాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటి వరకు 22,087 మందికి రూ.35 వేల చొప్పున పావలా వడ్డీ రుణాలు అందజేశాం. మిగతావారికీ త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
స్త్రీనిధి రుణాలు ఇవ్వడంలో జాప్యమెందుకు?
ప్రతి సంఘంలోని 8 మందికి ఈ బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున రుణం ఇస్తున్నాం. 36 వేల మందికి రూ.178.29 కోట్లు రుణ లక్ష్యం కాగా.. ఇప్పటికి 14,240 మందికి రూ.61.67 కోట్లు మేర రుణాలు అందజేశాం.
మండల సమాఖ్యలను వ్యాపార రంగంలో ఎలా ప్రోత్సహిస్తున్నారు?
ప్రతి మండల సమాఖ్య ద్వారా వ్యాపారాలు చేయించాలని నిర్ణయించాం. ఇప్పటికే సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట మండల సమాఖ్యలు వ్యాపారాలు ప్రారంభించాయి. తొలుత రూ.5 లక్షల వ్యయంతో వీటిని నిర్వహిస్తున్నారు. టీపొడి, కారం, వస్త్రాలు, మసాల సామగ్రి తయారు చేస్తున్నారు. మరిన్ని సమాఖ్యలకు తోడ్పాటును అందిస్తాం.
చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో ఎంత మందితో వ్యాపారాలు చేయిస్తున్నారు?
జిల్లాలో మూడు విడతలుగా లక్ష మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఒక్కొక్కరికి రూ.56,250 చొప్పున చేయూత పథకంలో లబ్ధి చేకూరింది. వీరిలో 21,755 మంది వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చారు. వీరితో కిరాణా, ఫ్యాన్సీ, హోటల్, తదితర వ్యాపారాలు చేయిస్తున్నాం. వీరికి అదనంగా బ్యాంకు రుణం అందించేందుకు కృషి చేస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు అమలు చేయడంలేదు?
కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీతో పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు కల్పిస్తోంది. పీఎం ఫార్మనైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా గరిష్ఠంగా రూ.50 లక్షలు, కనిష్ఠంగా రూ.25 లక్షల వరకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. కానీ మహిళలు రూ.10 లక్షలు, రూ.15 లక్షల యూనిట్ల ఏర్పాటుకే ముందుకు వస్తున్నారు. వీరికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. కేంద్రం ఈ పథకం కింద 35 శాతం రాయితీ కల్పిస్తోంది.
జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు ఎటువంటి తోడ్పాటు ఇస్తున్నారు?
పీడీ : జిల్లాలో ఈ ఏడాది జగనన్న తోడు పథకం కింద 10,995 మందికి రుణాలు కల్పించాలని లక్ష్యంగా చేసుకున్నాం. బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇప్పటి వరకు 10,454 మంది చిరువ్యాపారులకు రుణాలు కల్పించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్