అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కేంద్రం
నూతనంగా అభివృద్ధి చేస్తున్న అధ్యాపకుల శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ బ్లాక్ ఆధునికీకరణ
న్యూస్టుడే, దేవీచౌక్
నూతనంగా అభివృద్ధి చేస్తున్న అధ్యాపకుల శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం కళాశాలలోని ఎన్సీసీ బ్లాక్కు మరమ్మతులు చేసి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తి కావొచ్చాయి. కళాశాలలో గదుల కొరత కారణంగా దీనిని తరగతి గదులుగా వినియోగించాలని తొలుత ఆలోచించారు. తర్వాత కమిషనరేట్ సూచనల మేరకు అధ్యాపకుల శిక్షణ కోసం వినియోగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నాలుగు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో ఇదొకటి.
ఇక్కడే వసతి..
నోడల్ రిసోర్స్ సెంటర్(ఎన్ఆర్సీ)గా ఉన్న కళాశాలలో ఇప్పటికే పది శిక్షణ తరగతులు జరిగాయి. అందులో అయిదు రెసిడెన్షియల్, అయిదు నాన్ రెసిడెన్సియల్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధ్యాపకులకు ప్రస్తుతం హోటల్స్లో వసతి ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఖర్చు తగ్గించుకునేందుకు వసతితో కూడిన శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కళాశాలకు చెందిన అధ్యాపకుడైనా ఇక్కడ శిక్షణ పొందవచ్చు.
ఎన్ఆర్సీ పరిధిలో ఉన్న 13 ప్రభుత్వ కళాశాలలకు చెందిన అధ్యాపకులకు అవకాశం కల్పిస్తున్నారు. సుమారు రూ.51 లక్షలతో తీర్చిదిద్దుతున్న ఈ భవనంలో 18 గదులతోపాటు రెండు మినీ సెమినార్ హాల్స్, పరిపాలన కార్యాలయం, డైరెక్టర్ కార్యాలయం అందుబాటులోకి రానున్నాయి. ఈ శిక్షణ కేంద్రంలో 17 లైఫ్ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకుల్లో అదనపు విజ్ఞానం పెంపొందించే విధంగా శిక్షణ ఉంటుంది. ఇప్పటికే ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు కాగా, ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే విద్యా
సంవత్సరం నుంచి ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ కృష్ణ తెలిపారు.
ఎన్ఆర్సీ పరిధిలో కళాశాలలు
రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాల, కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల, ఎస్కేఆర్ మహిళా కళాశాల, రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిడదవోలు వీఆర్కే కళాశాల, నిడదవోలు ఎస్వీడీ మహిళా కళాశాల, కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్