logo

ఎమ్మెల్సీ విజయంతో నూతనోత్తేజం

రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిందని ఆ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి అన్నారు.

Published : 24 Mar 2023 04:36 IST

కొవ్వూరులో కేకు కోస్తున్న ద్విసభ్య కమిటీ సభ్యుడు సుబ్బరాయచౌదరి, నాయకులు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిందని ఆ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన నేపథ్యంలో నియోజకవర్గ కార్యాలయంలో గురువారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. కేక్‌ కోసి, మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు దాయన రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని