నేడు గొప్పలు.. నేడు తిప్పలు
అక్షర కోవెలకు చక్కటి సొబగులు.. ఇంటిని తలపించే ఆహ్లాద వాతావరణం.. తద్వారా సమర్థ బోధనకు నాడు-నేడు పథకంతో శ్రీకారం చుట్టామని పాలకులు ఊదర గొడుతున్నా.. అందుకు భిన్నమైన పరిస్థితులు క్షేత్రంలో కనిపిస్తున్నాయి.
అక్షర కోవెలకు చక్కటి సొబగులు.. ఇంటిని తలపించే ఆహ్లాద వాతావరణం.. తద్వారా సమర్థ బోధనకు నాడు-నేడు పథకంతో శ్రీకారం చుట్టామని పాలకులు ఊదర గొడుతున్నా.. అందుకు భిన్నమైన పరిస్థితులు క్షేత్రంలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా నిర్మాణాలకు సిమెంట్ కొరత వెంటాడుతోంది. కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో నిధులు అందక పనులు నిలిచిపోతే... మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణ సామగ్రి అందుబాటులో లేదు. మరికొన్నిచోట్ల అదనపు పాఠశాలల భవనాలు అర్ధాంతరంగా నిలిచి సరైన వసతుల్లేక విద్యార్థులు ఆరుబయట, వరండాల్లో చదవాల్సి వస్తోంది. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నా అధికారులు... అవసరమైన మేర సామగ్రి దరి చేర్చని వేళ ఇబ్బందులు తప్పడం లేదు. 10 రోజులుగా నాడు-నేడు రెండో దశ పనుల బిల్లులు చెల్లింపులు జరుగుతున్నా నిర్మాణ సామగ్రి కొరత వెంటాడుతోంది. వీటి గురించి ఇంజినీరింగ్ అధికారులను ప్రధానోపాధ్యాయులు అడుగుతుంటే అదిగో.. ఇదిగో అని కాలయాపన చేస్తున్నారే తప్ప సమకూర్చడం లేదని వాపోతున్నారు.
ఈనాడు, రాజమహేంద్రవరం,
న్యూస్టుడే, కాకినాడ నగరం, పిఠాపురం
నిధులున్నా.. సిమెంటు లేదు...
ముమ్మిడివరం బళ్లగేటు సెంటర్ పాఠశాలలో ఆరు నెలులుగా వినియోగించని సిమెంటు బస్తాలు
అల్లవరం మండలంలో ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు నిరుడు ఆగస్టులో రావాల్సిన రూ.13.51 లక్షలు వారం కిందట జమయ్యాయి. ఈ నిధులతో పనులు ప్రారంభిద్దామని ఇంజినీరింగ్ అధికారులను సిమెంటు సరఫరా చేయాలని కోరగా.. గోదాములో నిల్వలు సిద్ధంగా లేవని, మరో పాఠశాల వద్ద మొదటి విడతలో పంపిణీ చేసిన సిమెంటు ఉందని.. తెప్పించుకుని పని ప్రారంభించమని సూచించారు. ఇప్పటికే ఆ సిమెంటు గడ్డకట్టుకు పోయి నిరుపయోగంగా ఉందనీ.. దాంతో పనులు ఎలా ప్రారంభించాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాపోతున్నారు.
నాలుగు నెలలుగా బిల్లుల్లేవ్..
పిఠాపురం: ఓబీఎస్ పాఠశాలలో తుప్పు పట్టిన ఇనుము, ఇసుక
పిఠాపురం పురపాలికలో నాడు-నేడు పనులు నత్తను తలపిస్తున్నాయి. నాలుగు నెలలుగా బిల్లులు అందక పనులు నిలిచి పిల్లలకు అవస్థలు తప్పడం లేదు. పిఠాపురంలో ఓబీఎస్ మున్సిపల్ పాఠశాలలో ఎనిమిది అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.95.99 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో ఆరు గదుల నిర్మాణమే జరుగుతోంది. ఇప్పటికి రూ.20.03 లక్షల పనులు జరుగ్గా రూ.10 లక్షల బిల్లు బకాయి ఉంది. నిర్మాణానికి తెచ్చిన ఇనుము తుప్పు పడుతుండగా.. అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
నిధులు ఇవ్వడం లేదండి
గోకవరం జడ్పీఉన్నత పాఠశాలలో కొలిక్కిరాని అదనపు గదుల నిర్మాణ పనులు
గోకవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.96 లక్షలతో ఎనిమిది తరగతి గదుల నిర్మాణాన్ని గతేడాది ఏప్రిల్లో ప్రారంభించినా నేటికీ పూర్తికాలేదు. కొన్ని నెలలుగా నిధులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మేరకు వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాబార్డు నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదులదీ ఇదే పరిస్థితి.
రూపాయి రాక ఇలా...
నాడు - నేడు పనులకు ఇచ్చే నిధుల్లో 30 శాతం మేర లేబర్, మెటల్కు.. ఇతర 70 శాతం నిర్మాణ సామగ్రికి కేటాయిస్తున్నారు. 30 శాతం సొమ్ము మాత్రమే నేరుగా పాఠశాల ఖాతాలో జమ అవుతుంది. నిర్మాణ సామగ్రికి కేటాయించిన 70 శాతం నిధులు నిర్దేశిత సంస్థలకు వెళ్తాయి. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు 15 రోజులు ముందుగా ఆన్లైన్లో ఇండెంట్ పెడితే.. సామగ్రి సరఫరా చేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నా.. క్షేత్రంలో ఆ ఊసే లేదు. సకాలంలో ఇసుక, సిమెంటు, ఇనుము ఇతర సామగ్రి
రాకపోవడం, అవి చేరాక బిల్లులు కాకపోతే ఆ సామగ్రి పాడవడం పరిపాటిగా మారింది.
ప్రత్యేక దృష్టిసారిస్తాం...
నాడు నేడు పనులకు సిమెంట్ సమస్య ఉన్న వాస్తవమే. పనుల పురోగతిపై ఇప్పటికే కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. పాఠశాలల వారీగా సిమెంట్ ఎక్కడ ఎంత మేర అవసరమో ఇండెంట్ ఇస్తే త్వరతిగతిన తెప్పించేందుకు చర్యలు తీసుకుటాం. మేమూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి పనులు వేగవంతం చేస్తాం. నిధులు ఎప్పటికప్పుడు మంజూరవుతున్నాయి.
కె.అన్నపూర్ణ, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ
కాకినాడ జిల్లాలో..
రెండో విడత ఎంపికైన పాఠశాలలు : 776
పనుల సంఖ్య: సుమారు 1,100
నిధుల మంజూరు: రూ.322 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..