విజ్ఞాన భాండాగారాలు.. విలవిల
విజ్ఞాన భాండాగారాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలకు గ్రహణం పట్టింది. నిధుల లేమి, అసౌకర్యాలు వెంటాడుతుండగా.. వాటికి సిబ్బంది కొరత తోడైంది.
ఏళ్లపాటు భర్తీకాని పోస్టులతో అవస్థలు
న్యూస్టుడే, గాంధీనగర్ (కాకినాడ)
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దినపత్రికలు చదువుతున్న పాఠకులు
విజ్ఞాన భాండాగారాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలకు గ్రహణం పట్టింది. నిధుల లేమి, అసౌకర్యాలు వెంటాడుతుండగా.. వాటికి సిబ్బంది కొరత తోడైంది. పూర్తిస్థాయిలో రెగ్యులర్ పోస్టులు భర్తీకాకపోవడంతో పొరుగు సేవల సిబ్బంది, పార్ట్టైం వర్కర్లు, స్వీపర్లతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సేవలు అందించలేక చతికిల పడుతున్నాయి. కొన్ని గ్రంథాలయాలను రెండు, మూడురోజులకోసారి తెరిచే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లా గ్రంథాలయ సంస్థను మార్చి 13, 1952లో ప్రారంభించారు. అప్పటి నుంచి సంస్థ ఆధీనంలో కాకినాడలో జిల్లా ప్రధాన గ్రంథాలయం ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 101 శాఖా, 48 గ్రామీణ గ్రంథాలయాలు ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామీణ గ్రంథాలయాలు కేవలం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటికి తోడు పలు గ్రామాల్లో పుస్తక పంపిణీ కేంద్రాలను 165 ఏర్పాటు చేయగా అవన్నీ పనిచేస్తున్నాయి.
సిబ్బంది కొరత...
ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల్లో ప్రభుత్వ అనుమతి ప్రకారం 204 గ్రంథాలయాధికారుల పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు గ్రేడ్ 1, 2, 3 విభాగాల్లో 65, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 35 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా సగం మంది సిబ్బంది కొరత ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థలో గతంలో కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయిన 31 ఉద్యోగాల భర్తీపై కోర్టు భర్తీకి అనుమతివ్వడంతో చర్యలు చేపడుతున్నట్లు గత ఏడాది జులైలో జరిగిన సమీక్ష సమావేశంలో ఛైర్పర్సన్ దూలం పద్మ వెల్లడించినా ఏడాదిగా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించలేదు.
జిల్లాలో ఇలా..
జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు, 31 శాఖా గ్రంథాలయాలున్నాయి. మొత్తం 40 మంది సిబ్బంది ఉన్నారు. గాంధీనగర్ శాఖా గ్రంథాలయంలో రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ లేరు. గ్రంథాలయంలో పుస్తకాలు, ఇతర రికార్డుల నమోదుతోపాటు, పాఠకులకు పుస్తకాలు అందజేయడం, సభ్యత్వ నమోదు, పుస్తకాలు తిరిగి తీసుకోవడం, వాటిని ర్యాకుల్లో సర్థడం, దినపత్రికల ఫైలింగ్ వంటి పనులన్నీ గ్రంథాలయాధికారే చేయాల్సి వస్తోంది. తాళ్లరేవు, కాజులూరులకు ఒకే గ్రంథాలయాధికారి ఉండటంతో ఒక్కోచోట మూడేసి రోజులు చొప్పున పనిచేస్తున్నారు. శంఖవరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో బాలల, శ్రీనగర్ శాఖా గ్రంథాలయాలు సిబ్బంది కొరత కారణంగా మూతపడ్డాయి. తుని గ్రంథాలయం గ్రేడ్-1 విభాగంలో ఉన్నప్పటికీ రికార్డు అసిస్టెంట్తో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 60 వరకు పుస్తక పంపిణీ కేంద్రాలుండగా అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి.
ప్రభుత్వ అనుమతులకు ఎదురుచూపు
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాఖా గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. దీనిపై 31 పోస్టులు భర్తీచేసుకునేందుకు గతంలో ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం.
వి.ఎల్.ఎన్.ఎస్.వి.ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శ
రూ.8 కోట్ల బకాయిలు..
కాకినాడలో జిల్లా గ్రంథాలయ సంస్ధ భవనం
గతంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఖాతాలో గ్రంథాలయాధికారుల జీతాలు ప్రభుత్వమే చెల్లించేది. ఈ క్రమంలో ఏటా సుమారు రూ.పదికోట్లు వరకు జీతభత్యాలుగా వచ్చేది. ప్రస్తుతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ విడుదల ఆపేసి, గ్రంథాలయ సెస్ ఆధారంగా జీతాలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజలు చెల్లించే ఇంటి, స్థలం పన్నుల్లో రూపాయికి ఎనిమిది పైసలు గ్రంథాలయ సెస్గా వసూలు చేస్తున్నా వాటిని ఆయా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, పంచాయతీలు జమ చేయక పోవడంతో రూ.8 కోట్ల మేర సెస్ బకాయిలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా