ఈతకు వెళ్లి అనంత లోకాలకు..
సరదాగా స్నేహితులతో కలిసి కోనేరులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో చోటుచేసుకుంది.
పదో తరగతి విద్యార్థి విషాదాంతం
సాయిదుర్గ
జి.మామిడాడ (పెదపూడి): సరదాగా స్నేహితులతో కలిసి కోనేరులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పేలూరి సాయి దుర్గ(16) పదోతరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూపు ఫొటో కార్యక్రమం తరువాత 11 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఇంటిలో తమ పుస్తకాల సంచులు పెట్టి స్థానిక కోదండ రామాలయం కోనేరు వద్దకు చేరుకున్నారు. తోటి విద్యార్థులతో కలిసి సాయిదుర్గ కోనేటిలో ఈతకొట్టి మెట్లపై కూర్చున్నాడు. అతనితో వెళ్లిన స్నేహితులు ఇంటికి వచ్చేశారు. అనంతరం కోనేట్లో సాయిదుర్గ మునిగిపోతున్నాడంటూ కేకలు వినిపించడంతో అక్కడున్న మరో ఇద్దరు విద్యార్థులు అతడిని బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం సాయిదుర్గ తల్లిదండ్రులకు తెలియజేయగా వారు బంధువులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికితోడు, తోటి విద్యార్థులే ఇంటి నుంచి కోనేరుకు తీసుకెళ్లి చంపేశారంటూ సాయిదుర్గ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాకమిటీ ఏం చేస్తోంది? విద్యార్థులను ఎందుకు బయటకు పంపారని ప్రధానోపాధ్యాయుడు కోరాడ శ్రీనివాస్, ఉపాధ్యాయులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో మృతుని తల్లిదండ్రులు పేలూరి వెంకన్న, దుర్గ బంధువులతో కలిసి జడ్పీ బాలుర పాఠశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ మూడు గంటలపాటు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పెదపూడి ఎస్సై పి.వాసు పాఠశాల వద్దకు చేరుకుని సాయిదుర్గ స్నేహితులను విచారించారు. ఇంతలో కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాసరావు, మండల ఇన్ఛార్జి విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారిణి అన్నపూర్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. మృతుని తండ్రి పేలూరి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వాసు తెలిపారు.
‘స్నేహితులే నా కొడుకును చంపేశారు’
రోడ్డుపై మృతదేహంతో నిరసన తెలుపుతున్న విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు
సాయిదుర్గను స్నేహితులే ఇంటి నుంచి తీసుకెళ్లి చంపేశారంటూ తల్లిదండ్రులు పేలూరి వెంకన్న, దుర్గలు ఆరోపించారు. పాఠశాలలో ఫొటో తీసుకుంటానంటూ మంచి దుస్తులు వేసుకుని వెళ్లి ఇంటికి వచ్చిన తన కుమారుడిని కోనేరు వద్దకు తీసుకెళ్లి ఈత పేరుతో చంపేసి చెరువులో మునిగిపోయాడంటూ అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. ఒంటిపై గాయాలు ఉన్నాయని, వాటి సంగతి తేల్చాలని వెంకన్న డిమాండ్ చేశారు. తమ కొడుక్కి ఈత వచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరై మంచి మార్కులతో పాసవుతాడని ఆనందపడే సమయంలో ఇలా జరిగిందని విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్