మత్తు ఊబిలో.. భవిత గాలిలో!
వ్యసనం యువతను దారి మళ్లిస్తోంది.. ఉన్నత లక్ష్యాలను గురితప్పేలా చేస్తోంది. మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థి దశ నుంచే కొందరు బానిసలవడం కలవరపెడుతోంది.
యువతకు గంజాయి.. వ్యసనాల ఎర
అంతర్రాష్ట్ర మాఫియా అడ్డదారులన్నీ ఇక్కడే..
ఫలితమివ్వని నిర్మూలన చర్యలు
ఈనాడు, కాకినాడ; న్యూస్టుడే, అమలాపురం పట్టణం
వ్యసనం యువతను దారి మళ్లిస్తోంది.. ఉన్నత లక్ష్యాలను గురితప్పేలా చేస్తోంది. మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థి దశ నుంచే కొందరు బానిసలవడం కలవరపెడుతోంది. మత్తు మాఫియా వీరిని పావులుగా వాడుకుంటోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై దృష్టిసారించామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా.. గంజాయి నిల్వలు తగలబెడుతూ మత్తు రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నం. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులు (ఏవోబీ)తోపాటు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం నుంచి గంజాయి నిల్వలు తరలివస్తున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో అక్రమ రవాణా, వినియోగం ప్రభావం ఇటీవల ఎక్కువైంది. నిర్మూలన చర్యలు ఫలితమివ్వడంలేదు.
మత్తు.. చిత్తు..
కోటనందూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న 250 కేజీల గంజాయి నిల్వలు (పాత చిత్రం)
దేశంలో మత్తులో జోగుతున్న 127 జిల్లాలను గతంలో ఓ సర్వే ద్వారా కేంద్రం గుర్తించింది. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి కూడా ఉంది. గంజాయి, నల్లమందు, ఎండీఎంఏ ఇతరత్రాల ప్రభావం ఇక్కడుంది.
* గంజాయి మాఫియా సరకు అక్రమ రవాణాకు అమాయక గిరిజనాన్ని, పేదలను ఎన్నుకుంటోంది. అలానే యువతకు మత్తు, కాసుల ఎరచూపి ఊబిలోకి దింపుతోంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోంది.
* కాకినాడలోని ఓ కళాశాలలో ఫోరెన్సిక్ కోర్సు చదువుతున్న యువకుడు మొదట్లో గంజాయి అక్రమ రవాణాకు అలవాటు పడ్డాడు.. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయమై ఎండీఎంఏ డ్రగ్ను తెచ్చి విద్యార్థులకు విక్రయించే స్థాయికి ఎదిగాడు. సరకు తరలించే క్రమంలో 48.6 గ్రాముల మత్తుమందుతో పోలీసులకు చిక్కాడు.
* అమలాపురంలో గంజాయి మత్తులో ఉన్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. ముమ్మిడివరంలో గంజాయి చిల్లరగా అమ్ముతున్న ముమ్మిడివరం, ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల యువకులు గతంలో పోలీసులకు చిక్కారు. కాకినాడ పోలీసులు గతేడాది 15 ఎండీఎంఏ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని విద్యాలయాలు- వసతిగృహాల్లో తనిఖీలు, విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడం గతి తప్పుతున్న పరిస్థితిని స్పష్టంచేస్తోంది.
* మత్తుకు బానిసలై ఒత్తిడి, అనారోగ్యానికి గురవడం.. చదువులో వెనుకబాటు, నేరాలకు పాల్పడటం వంటివి వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కింద అవగాహన చర్యలు చేపడుతోంది. బాధితులకు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలోని వ్యసన విముక్తి కేంద్రాల్లో కౌన్సెలింగ్, వైద్యం అందిస్తున్నారు.
అంతా అడ్డదారే..
ఏలూరు రేంజి పరిధిలోని ఆరు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలు (పాత చిత్రం)
* స్మగ్లర్ల ప్రోత్సాహంతో ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది. ఈ నిల్వలు ఉమ్మడి విశాఖ మీదుగా తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. * ఆపరేషన్ పరివర్తన పేరుతో పోలీసులు చేపట్టిన చర్యల వల్ల సాగుకు కొంత అడ్డుకట్ట పడినా.. ఒడిశా రాష్ట్రంలోని మారుమూల, మావో ప్రభావిత ప్రాంతాల్లో కట్టడి సాధ్యపడటంలేదు. మల్కన్గిరి జిల్లాలోని నిల్వలను పడవల్లో సీలేరు నది దాటించి మైదానంలోకి తెస్తున్నారు. ద్రవ, బిళ్లల రూపంలో గంజాయిని రూపు మార్చి హద్దులు దాటిస్తున్నారు. * నర్సీపట్నం- ఏలేశ్వరం.. నర్సీపట్నం- పాయకరావుపేట- తుని.. గోకవరం- రంపచోడవరం- మారేడుమిల్లి- భద్రాచలం మీదుగా ఎక్కువగా సరకు దాటుతోంది. అక్రమ వ్యాపారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల బాగా విస్తరించింది.
గంజాయి గుట్టు ఇదీ..
విద్యార్థులకు అమ్ముతున్నది ఇలాంటి పొట్లాల్లోనే..
* 3 రకాలు: ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో శీలావతి, రాజహంస (కల్లి), కలపత్రి (కాడ) రకాల గంజాయి సాగుచేస్తున్నారు. * 5 అంశాలు: గంజాయి అక్రమ వ్యాపారంలో సాగు.. ఉత్పత్తి.. నిల్వ.. రవాణా.. అమ్మకాలే కీలకం
* 11 మార్గాలు: ఏవోబీలో సాగవుతున్న గంజాయిని కాలినడకన, పడవలు, గాడిదలు, గుర్రాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రక్కులు, బస్సులు, రైలు మార్గాల్లో దాటిస్తున్నారు. * 16: గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఆంధ్రలోని పలు ప్రాంతాల వారితోపాటు.. తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, పంజాబ్, గుజరాత్, దిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులను పోలీసులు వివిధ కేసుల్లో అరెస్టు చేశారు.
చిన్న చేపలే చిక్కుతున్నాయ్
ఉమ్మడి జిల్లా మీదుగా పలు రాష్ట్రాలకు గంజాయి నిల్వలు తరలిపోతున్నా.. పోలీసులకు చిక్కుతున్నది చిన్న చేపలే. అంతర్రాష్ట్ర ముఠాలకు స్థానిక రాజకీయ నాయకుల దన్ను ఉండడంతో వ్యవహారం అడ్డంకులు లేకుండా సాగిపోతుంది. అడపాదడపా సరకు తరలిస్తున్నవారు పట్టుబడుతున్నా అంతర్రాష్ట్ర ముఠాలు, తెరవెనుక సూత్రధారులు చిక్కడంలేదు.
కఠిన చర్యలు తీసుకుంటాం
గంజాయి తరలించినా, సేవించినా, అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటుచేశాం. విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.
షేక్ ఖాదర్ బాషా, ఏఎస్పీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత