Yanamala: జగన్ దృష్టిలో ‘నా’ అంటే నాశనం: యనమల
‘ముఖ్యమంత్రి జగన్ ప్రతి ప్రసంగంలోనూ నా ఎస్సీలు..నా బీసీలు..నా మైనార్టీలు అంటారు.. ఆయన దృష్టిలో ‘నా’ అంటే నాశనం.. ఆయా వర్గాలను నాశనం చేయడమే జగన్ లక్ష్యం’’ అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు.
తెదేపాతోనే వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం
రాష్ట్ర బీసీ నేతల సమావేశంలో ప్రతినిధులు
మాట్లాడుతున్న యనమల.. వేదికపై బుద్ధా వెంకన్న, రెడ్డి సుబ్రహ్మణ్యం, వాసు, అనుశ్రీ సత్యనారాయణ, సతీష్
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, టి.నగర్: ‘ముఖ్యమంత్రి జగన్ ప్రతి ప్రసంగంలోనూ నా ఎస్సీలు..నా బీసీలు..నా మైనార్టీలు అంటారు.. ఆయన దృష్టిలో ‘నా’ అంటే నాశనం.. ఆయా వర్గాలను నాశనం చేయడమే జగన్ లక్ష్యం’’ అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. వెనుకబడిన వర్గాలంటే ఆ కుటుంబానికి చిన్నచూపన్నారు. రాజమహేంద్రవరంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తెదేపాకు బీసీలు వెన్నెముకని.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. బీసీలు సంఖ్యాపరంగా సుమారు 60 శాతం ఉన్నా.. ఆర్థిక దన్ను లేకపోవడంతో రాజకీయంగా ఎదగడం లేదన్నారు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. ఆ బాధ్యత ఆయా కుల సంఘ నాయకులు తీసుకుని పోరాటాలు చేయాలని.. అందుకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకపోతే బడుగు బలహీనవర్గాలే నష్టపోతామన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయన్నారు. సమావేశంలో జనసేన నగర ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, భాజపా నాయకులు కురగంటి సతీష్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, వివిధ పార్టీల నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిధుల్లేని కార్పొరేషన్లు ఎందుకు?
-రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్
జనగణన చట్టబద్దంగా చేయాలి. ఎన్నికలు వస్తుండటంతో రాష్ట్రంలో తూతూ మంత్రంగా ఓ యాప్ తయారుచేసి కులగణన చేస్తామని సీఎం చెబుతున్నారు. దీనికి చట్టబద్దత లేదు. 56 కార్పొరేషన్ల మంత్రి వేణుగోపాలకృష్ణ ఉన్నా.. ఆయా ఛైర్మన్లకు కూర్చొనేందుకు కుర్చీ ఉండదు. నిధుల్లేని కార్పొరేషన్లు ఎందుకు? అయిదేళ్లలో రూ.75 వేల కోట్ల బీసీ సబ్ప్లాన్ నిధులు జగన్ దారి మళ్లించారు.
వసతి గృహాలు ఎత్తేశారు..
-తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 23 బీసీ వసతిగృహాలను ఎత్తేశారు. గోపాలపురం, రాజానగరం, రాజమమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ హయాంలో కులవృత్తులకు ఇచ్చిన భూములను కబ్జా చేశారు.‘ఇటీవల సీనియర్ మంత్రి ధర్మానను కలిశాం.. సమస్యల గురించి ప్రస్తావించగా.. మా దగ్గర అధికారం ఎక్కడుంది? ఒకటి జగన్.. రెండు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో ఎటు చూసినా మాఫియాలే: షర్మిల
[ 01-05-2024]
ఎటు చూసినా ల్యాండ్, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మాదిగ జాతి ద్రోహి జగన్
[ 01-05-2024]
మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది
[ 01-05-2024]
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్రెడ్డి వెల్లడించారు. -
పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
[ 01-05-2024]
కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు. -
గండాల దారులను గాలికొదిలేశారు!
[ 01-05-2024]
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. -
అభాగ్యులపై పగ.. పంపిణీలో దగా
[ 01-05-2024]
ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. -
మిల్లులో వేలు పెట్టారు.. కార్మికుల పొట్ట కొట్టారు
[ 01-05-2024]
రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం. -
ఆగని అధికార పార్టీ ఆగడాలు
[ 01-05-2024]
ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. -
జగన్ దళితులను దగా చేశారు: గోరంట్ల
[ 01-05-2024]
అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. -
ఇచ్చినవే అమలుకాక.. కొత్తవి గుప్పించలేక..
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు. -
మండపేటలో వారాహి విజయభేరి సభ నేడు
[ 01-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. -
బరి.. గెలుపే గురి
[ 01-05-2024]
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. -
భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?
[ 01-05-2024]
భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేరు మార్పునకు ముద్రగడ సిద్ధంగా ఉండాలి
[ 01-05-2024]
త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. -
బిల్లు.. ఇల్లు ఘొల్లు
[ 01-05-2024]
గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది. -
పరారీలో అధికార పార్టీ నేతలు
[ 01-05-2024]
పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!