ఆగని అధికార పార్టీ ఆగడాలు
ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు.
ఎన్నికల వేళ ఇసుకాసురుల దందా
బల్లిపాడులో ఇసుక లారీలను అడ్డుకున్న కూటమి నాయకులు
తాళ్లపూడి, న్యూస్టుడే: ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు, కుమారదేవం ఇసుక ర్యాంపుల్లో మంగళవారం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. లారీలను నిలిపేశారు. అక్రమంగా ఇసుకను లోడు చేసే పొక్లెయిన్లను ఆపేశారు. మైనింగ్ తదితర శాఖల అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎన్నికల విధుల్లో ఉన్నామని చెబుతున్నారని అంటున్నారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి వారితో మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు.
ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలున్నా..
అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని ఎన్జీటీ, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆయా శాఖల అధికారులు పట్టించుకోవట్లేదని తెదేపా, జనసేన, భాజపా తదితర పార్టీల నాయకులు ఆరోపించారు. సంబంధిత శాఖల అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓపెన్ ర్యాంపులో పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వుతున్నారని ఆరోపించారు. బిల్లులు లేకుండా దర్జాగా అక్రమంగా దోచేస్తున్నారని విమర్శించారు.
డ్రెడ్జింగ్ పేరుతో దోపీడి..
గోదావరి తీరాన ర్యాంపుల్లో పడవల మీద ఇసుక తెచ్చేలా పేరుకే బోట్స్మెన్ సొసైటీలను ఏర్పాటు చేశారు. అంతా అధికార పార్టీ నాయకులదే దందా. చిన్నపడవల యజమానులు, కార్మికులను బెదిరించి భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. తాళ్లపూడిలో రెండుచోట్ల బోట్స్మెన్ సొసైటీ ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయవు. ఇసుక తూకం వేసేందుకు వేయింగ్ యంత్రాలు ఉండవు. రాకపోకలు సాగించే రహదారుల్లో గేట్లు ఉండవు.
వైకాపా నాయకులతో కుమ్మక్కై..
తాళ్లపూడి మండలం బల్లిపాడు- కొవ్వూరు మండలం చిడిపి మధ్య ఉన్న ఓపెన్ ర్యాంపులో అయిదేళ్ల నుంచి వైకాపా నాయకుల కనుసన్నల్లో ఇసుకను భారీ పొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఈ దందా ఆగలేదు. ఈ ఓపెన్ ర్యాంపుల్లో లంక భూములను సైతం తవ్వేస్తున్నారని దళితులు ఆందోళనా చేసినా ప్రయోజనం శూన్యం. ఈ దందాతో కొంతమంది స్థానిక వైకాపా నాయకులు నెలకు
రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణానికి హానీ కలిగించేలా తవ్వకాలు జరుగుతున్నా...మైనింగ్, రెవెన్యూ, ఏజీఆర్బీ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
-
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ
-
రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
-
ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు
-
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి