జగన్ దళితులను దగా చేశారు: గోరంట్ల
అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు.
సంఘీభావం తెలుపుతున్న బుచ్చయ్యచౌదరి
టి.నగర్, న్యూస్టుడే: అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ అయిదేళ్ల అధికారంలో దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేశారన్నారు. ఉపప్రణాళిక నిధులను దారిమళ్లించి వారి భవిష్యత్తుకు అడ్డు తగిలారన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం లేకుండా చేశారన్నారు. స్టడీసర్కిళ్లను నిర్వీర్యం చేశారన్నారు. దళితుడిని చంపిన వ్యక్తికి ఎమ్మెల్సీగా పదవి అప్పగించారన్నారు. సీతానగరంలో ఇసుక దోపిడీని అడ్డుకొంటే శిరోముండనం చేయించారన్నారు. అమ్మఒడి పథకానికి 16 లక్షల మంది అర్హులు ఉంటే దాన్ని 8 లక్షలకు కుదించడం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక అనేకమంది యువత ఇబ్బంది పడుతున్నారన్నారు. తాజాగా జగన్ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి మద్యం అమ్మకాలు పెంచేశారన్నారు. కాపు ఉద్యమాన్ని ముద్రగడ అణచి వేశారని, కాపులకు అన్యాయం చేసిన జగన్కు ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ ఉత్తరకోస్తా జిల్లాల అధ్యక్షుడు ముమ్మిడివరపు చినసుబ్బారావు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం కూటమికి మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్