పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు.
కుమారుడి ప్రాణం తీసిన తండ్రి
అరవింద్ (పాతచిత్రం)
సర్పవరం జంక్షన్, న్యూస్టుడే: కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు.. కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. ఇంద్రపాలెం వివేకానంద స్కూల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గుడాల వెంకటరమణ (బుజ్జి) కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు అరవింద్(26) కూడా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా పనిమానేసి.. మద్యం, గంజాయికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించసాగాడు. సోమవారం అర్ధరాత్రి కూడా అరవింద్ మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను రూ.మూడు లక్షలు కావాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయంపై తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున తండ్రి వెంకటరమణ ఇనుపరాడ్తో కుమారుడు అరవింద్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
నిందితుడు పరారీలో ఉన్నాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అరవింద్ ఇటీవల ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉండి సెటిల్మెంట్ చేసుకుని బయటపడినట్లు తెలుస్తోంది.
మత్తులో వ్యక్తిపై చాకుతో దాడి
పిఠాపురం: జగ్గయ్యచెరువులో మద్యం మత్తులో ఓ వ్యక్తి మరొకరిపై చాకుతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఎస్సై మురళీ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... తణుకు పట్టణానికి చెందిన ఆరుగురు బృందం రాడ్ బైడింగ్ వర్కు చేస్తుంటారు. కుమార పురంలో పనిచేస్తూ.. ఆదివారం రాత్రి మద్యం మత్తులో చాకుతో సరెళ్ల శ్రీను అనే వ్యక్తి సిరిలి రాంబాబును పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పోయారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మద్యం మత్తు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతుండగా..కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గంలో రోజురోజుకూ గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగి పోతుండటం ప్రమాదకరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్