గండాల దారులను గాలికొదిలేశారు!
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి.
రహదారుల అభివృద్ధి పట్టని ప్రభుత్వం
నిత్య ప్రమాదాలతో ప్రజల మృత్యువాత
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. ప్రాణాలు పోతున్నా పాలకులు పట్టించుకోరు. కొన్నింటికి సకాలంలో నిధులివ్వరు.. మరికొన్నింటికి నిధులున్నా పనులు పూర్తిచేయరు. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణమంటేనే వాహన చోదకులు హడలిపోతున్నారు. దారులు బాగుపడాలంటే ఇంకెందరి ప్రాణాలు పోవాలని ఆప్తులను కోల్పోయిన బాధితుల కుటుంబాల వేదన పాలకుల చెవికెక్కడం లేదు.
బిల్లు అందక యాతన
యర్నగూడెం త్యాజంపూడి రహదారి
కోటపాడు పెదరాయవరం మధ్య అధ్వాన్నంగా ఏడీబీ రోడ్డు
అయిదేళ్లలో 400 ప్రమాదాలు
మొత్తం కిలోమీటర్లు: 4.5
రహదారి దుస్థితి: భారీ గుంతలు పడి, రాళ్లు తేలి అధ్వానంగా దర్శనమిస్తోంది.
గుంతలు: సుమారు 65 పెద్ద, 285 చిన్న గుంతలు ఉన్నాయి.
ఏం చేయాలి: రెండు వరుసల రోడ్డు నిర్మించాలి.
ప్రతిపాదనలు: మరమ్మతులకు
రూ.27 లక్షలు మంజూ రయ్యాయని ర..భ. శాఖ
అధికారులు చెబుతున్నారు. నాలుగుసార్లు
టెండర్లకు పిలిచినా ఎవరూ రాలేదు.
న్యూస్టుడే, దేవరపల్లి
రాజమహేంద్రవరం సీతానగరం రహదారి
18 కి.మీ.ల్లో పది మందిబల్ఠి
మొత్తం కిలోమీటర్లు: 18.2 కి.మీ ఇప్పటికీ ప్రయాణం నిత్య యాతనే.
ప్రమాదకర గుంతలు: 28. ఈ అయిదేళ్లలో 35 ప్రమాదాలు చోటు చేసుకుని పదిమంది ప్రాణాలు కోల్పోయారు.
నత్తనడకే: రూ.70 కోట్లుతో విస్తరణ పనులు చేపట్టి నాలుగేళ్లు అయింది. ఇప్పటీకి పూర్తికాలేదు. నిర్మాణంపై పలుమార్లు ఎమ్మెల్యే రాజాను ప్రజలు ప్రశ్నించారు. ఆరేసి నెలలు వాయిదా వేసుకుంటూ వచ్చారు.
న్యూస్టుడే, సీతానగరం
అంబాజీపేట గన్నవరం (ఎ-జి రోడ్డు)
నవంబరు దాకా ఆగాల్సిం దేనా!
ప్రాధాన్యం: పి.సి.యు.(ప్యాసింజర్ కార్ యూనిట్) లెక్కప్రకారం ద్విచక్ర వాహనాలు మొదలుకుని భారీ వాహనాలు వరకు రోజూ ఈ మార్గంలో ఆరువేల రాకపోకలు సాగిస్తుంటాయి.
మొత్తం కిలోమీటర్లు : 8
ప్రమాదకర పరిస్థితి: పోతవరం వద్ద 320 మీటర్ల మేర రహదారి కుంగిపోయి అత్యంత ప్రమాదకరంగా మారింది.
గుంతలు: చిన్నాపెద్దా కలిపి సుమారు వెయ్యి
నిధులున్నా అభివృద్ధి చేయక: సి.ఆర్.ఎఫ్.(సెంట్రల్రోడ్ఫండ్) టెండరు గత ఏడాది డిసెంబరులో ఖరారైంది. ఈ రోడ్డుకు సుమారు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మార్చి 4న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేసినా ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు.
నవంబరు వరకు నాన్చుడే: రిటైనింగ్ వాల్ నిర్మించిన తరువాత అంటే వర్షాకాలం వెళ్లిన తరువాత రహదారి అభివృద్ధి పనులు చేస్తారని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. అంటే నవంబరు వరకు తారురోడ్డు పనులు జరిగే పరిస్థితి కానరావటంలేదు. అంతవరకు ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవు.
న్యూస్టుడే, పి.గన్నవరం
సామర్లకోట బిక్కవోలు రోడ్డు
బిల్లు అందక యాతన
మొత్తం కిలోమీటర్లు: పది
ప్రమాదకర పరిస్థితి: హుస్సేన్పురం నుంచి మండలం శివారు పెదబ్రహ్మదేవం వరకు రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా ఉంది. చిన్నా పెద్దా కలిపి సుమారు 500 వరకు గుంతులున్నాయి.
ప్రమాదాల తీవ్రత: గతంలో జరిగిన ప్రమాదాల్లో వాహనాలు అదుపుతప్పి ముగ్గురు మృతి చెందారు.
బిల్లులు చెల్లించక: రహదారి నిర్మాణానికి గతేడాదిలో రూ.5 కోట్లు మంజూరయ్యాయి. గుత్తేదారుకు బిల్లులు మంజూరుకాక మాధవపట్నం వద్ద పనులు ఆపేశారు.
న్యూస్టుడే, సామర్లకోట గ్రామీణం
రాజానగరం పెద్దాపురం ఏడీబీ రోడ్డు (కాకినాడ వరకు)
రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయక..
రహదారి పొడవు: 60 కిలోమీటర్లు.
నిర్మాణ అంచనా వ్యయం: రూ.300కోట్లు
ప్రమాదకర గుంతలు: 145
ఇదీ తీవ్రత: ఈ అయిదేళ్లలో 300కు పైనే ప్రమాదాలు జరిగి 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
కారణం: ఏడీబీ నిధులు విడుదల చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా.. బ్యాంకు సమకూర్చినవి ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లించినట్టు ప్రచారం
జరుగుతోంది. గుత్తేదారుకి రూ.50కోట్లుపైనే రావాల్సి ఉంది.
న్యూస్టుడే, రంగంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్
-
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?
-
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే