భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?
భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ద్రాక్షారామ ఆలయంలో అడ్డగోలు వసూళ్లు
భీమేశ్వరాలయంలో వాహనాలు నిలిపే ప్రదేశం
ద్రాక్షారామ, న్యూస్టుడే : భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. వీరి సంఖ్య రోజుకు మూడు వేల నుంచి అయిదు వేల వరకు ఉంటుంది. పర్వదినాలు, వివాహ వేడుకల సమయంలో దాదాపు పది వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది. ఇంత ప్రాధాన్యమున్న క్షేత్రం వద్ద భక్తుల నుంచి వసూలు చేసే వివిధ రుసుముల విషయంలో నియంత్రణ కొరవడింది. ముఖ్యంగా వాహనాల పార్కింగు విషయంలో పర్యాటకులు దోపిడీకి గురవుతున్నారు. ఆలయ ప్రాంగణంలో వాహనాలు నిలిపే వారి నుంచి రుసుము వసూలు చేసుకొనేందుకు ఏడాదికి ఒకసారి వేలం నిర్వహిస్తారు. హెచ్చుకు పాడిన వారు దక్కించుకుంటున్నారు. కొంతమంది అత్యాశతో హెచ్చు మొత్తానికి పాట దక్కించుకొని భక్తుల నుంచి అధిక మొత్తంలో రుసుము వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. వాస్తవానికి దేవాదాయశాఖ నిర్ణయించిన ధరల ప్రకారం లారీ/బస్సుకు రూ.100, ట్రాక్టరు/ మినీ వ్యానుకు రూ.50, చిన్నకారు/వ్యానుకు రూ.20, ఆటోకు రూ.15, స్కూటరు/మోటారు సైకిల్కు రూ.10, సైకిల్కు రూ.5 వసూలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బస్సుకు రూ.200, ట్రాక్టరు/వ్యానుకు రూ.150, చిన్నకారుకు రూ.50, ఆటోకు రూ.30, మోటారు సైకిల్కు రూ.20 చొప్పున వసూలుచేస్తున్నారు. దీనిపై గతంలో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఇంత వరకు ఈవో స్పందించిన దాఖలాలు లేవు. ఆలయ ప్రాంగణంలో పార్కింగు రుసుము ఎంత వసూలు చేయాలో బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఆలయంలో వివాహాలు చేసుకోడానికి ఏర్పాటు చేసే కల్యాణ మండపాలు విషయంలో కూడా ఇదే విధంగా దోపిడీ సాగుతోందని భక్తులు వాపోతున్నారు. ఒక్కో వివాహానికి రెండు, మూడు వేలు రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా ఈవో అండదండలతో రూ.15 వేల నుంచి 20వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం పాటదారుల బాగోగుల కోసం ఈవో పని చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నారు. భక్తుల అవసరాలు తీర్చే విధంగా అధికారులు పనిచేయాలని స్ధానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
-
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్