తొలి అడుగులు ఇక్కడే
ఆమె గజ్జె కట్టింది ఇక్కడే.. 14వ ఏట కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం వచ్చారు. స్థానిక హరికథా కళాశాలలో చేరి సుమారు పదేళ్లు హరికథ నేర్చుకుని ఆట, పాట, మాటలతో దానిని విశ్వవ్యాప్తం చేశారు.
ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారంపై హర్షం
పామర్రు, కపిలేశ్వరపురం(న్యూస్టుడే): ఆమె గజ్జె కట్టింది ఇక్కడే.. 14వ ఏట కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం వచ్చారు. స్థానిక హరికథా కళాశాలలో చేరి సుమారు పదేళ్లు హరికథ నేర్చుకుని ఆట, పాట, మాటలతో దానిని విశ్వవ్యాప్తం చేశారు. ఆమే..డి.ఉమామహేశ్వరి.. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమె తొలిసారిగా ప్రదర్శన ఇచ్చింది కూడా కపిలేశ్వరపురంలోనే. గురువులు, వేదపండితులు తంగిరాల బాలగంగాధర శర్మ ఆ కథ విని వెన్ను తట్టి పంపించారు. తరువాత విజయనగరంలో మొదలు పెట్టిన ఆమె ప్రస్థానం దేశ విదేశాల్లో మార్మోగింది. తొలి లలితకళా పురస్కారం కూడా కపిలేశ్వరపురంలోని సర్వారాయ ఎడ్యుకేషనల్ ట్రస్టు నుంచే అందుకున్నారు. తర్వాత ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు. తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయినా..హరికథలో రాటు దేలేలా చేసింది మాత్రం కపిలేశ్వరపురం జమీందారు ఎస్బీపీబీకే సత్యనారాయణరావు(చంటిదొర), రాజరాజేశ్వరేనని ఆమె వినమ్రపూర్వకంగా చెబుతారు. సర్వారాయ హరికథా పాఠశాలలో ఆమె విద్య నేర్చుకోవడమే కాకుండా మూడు సంవత్సరాలు గౌరవ ప్రధానార్చకురాలిగా కూడా పనిచేశారు. కపిలేశ్వరపురం, పామర్రు పరిసర ప్రాంతాల్లో కళాకారులంతా ఆనందోత్సాహాలతో మునిగితేలుతున్నారు. తమకే అవార్డు వచ్చినంత సంతోషంగా ఉందని కళాకారులు మరివాడ బుజ్జయ్య, వాడ్రేవు ప్రసాద్, నాగిరెడ్డి సతీష్, గొర్రెల కృష్ణ, వి.వీరభద్రరావు తదితరులు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో ఎటు చూసినా మాఫియాలే: షర్మిల
[ 01-05-2024]
ఎటు చూసినా ల్యాండ్, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మాదిగ జాతి ద్రోహి జగన్
[ 01-05-2024]
మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది
[ 01-05-2024]
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్రెడ్డి వెల్లడించారు. -
పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
[ 01-05-2024]
కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు. -
గండాల దారులను గాలికొదిలేశారు!
[ 01-05-2024]
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. -
అభాగ్యులపై పగ.. పంపిణీలో దగా
[ 01-05-2024]
ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. -
మిల్లులో వేలు పెట్టారు.. కార్మికుల పొట్ట కొట్టారు
[ 01-05-2024]
రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం. -
ఆగని అధికార పార్టీ ఆగడాలు
[ 01-05-2024]
ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. -
జగన్ దళితులను దగా చేశారు: గోరంట్ల
[ 01-05-2024]
అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. -
ఇచ్చినవే అమలుకాక.. కొత్తవి గుప్పించలేక..
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు. -
మండపేటలో వారాహి విజయభేరి సభ నేడు
[ 01-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. -
బరి.. గెలుపే గురి
[ 01-05-2024]
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. -
భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?
[ 01-05-2024]
భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేరు మార్పునకు ముద్రగడ సిద్ధంగా ఉండాలి
[ 01-05-2024]
త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. -
బిల్లు.. ఇల్లు ఘొల్లు
[ 01-05-2024]
గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది. -
పరారీలో అధికార పార్టీ నేతలు
[ 01-05-2024]
పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్