logo

ప్రాణం తీసిన సహజీవనం

ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.

Published : 29 Mar 2024 03:04 IST

మహిళ కోసం స్నేహితుడి హత్య

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి. రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎండీ ఉమర్‌ వివరాల మేరకు.. గ్రామీణం ప్రాంతంలోని పిడింగొయ్యి పంచాయతీ కవలగొయ్యి గ్రామానికి చెందిన పలుకూరి భాస్కరరావు(35) ఆటో కార్మికుడు.  భార్యతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. గ్రామంలో ఓ ఒంటరి మహిళతో అయిదేళ్ల కిందట భాస్కరరావుకు పరిచయం ఏర్పడి సహజీవనం సాగిస్తున్నారు. భాస్కరరావుకు గ్రామానికి చెందిన కందిపల్లి నారాయణమూర్తి స్నేహితుడు. కొంతకాలంగా భాస్కరరావును దూరం పెట్టిన సదరు ఒంటరి మహిళ.. నారాయణమూర్తితో సహజీవనం సాగించడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో స్నేహితుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ నెల 27న రాత్రి నారాయణరావు, భాస్కరరావులు కవలగొయ్యి లక్ష్మీనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగారు. ముందే పథకం ప్రకారం.. కత్తితో వచ్చిన నారాయణరావు మద్యం మత్తులో ఉన్న భాస్కరరావుపై దాడిచేసి పరారయ్యాడు. గురువారం ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళతో సహజీవనం నేపథ్యంలో తలెత్తిన వివాదం కారణంగానే భాస్కరరావు హత్య జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని