భట్నవిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నలుగురు యువకులు దుర్మరణం
మరో నలుగురికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో ధ్వంసమైన ఆటో
అమలాపురం గ్రామీణం, మామిడికుదురు, పి.గన్నవరం, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. అమలాపురం గ్రామీణ సీఐ వీరబాబు వివరాల ప్రకారం.. మామిడికుదురు, పి.గన్నవరం మండలాలకు చెందిన ఎనిమిది మంది ఒకే ఆటోలో యానాం వెళ్లి అక్కడ ఓ పుట్టినరోజు వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా భట్నవిల్లిలో ఆటో, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. మామిడికుదురు మండలం నగరానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), సాపే నవీన్ (19), పాసర్లపూడికి చెందిన నెల్లి నవీన్కుమార్ (22) పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన ఆటో నడుపుతున్న వల్లూరి అజయ్ (18) దుర్మరణం చెందారు. మృతదేహాలను పోలీసులు అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పంచనామా పూర్తిచేసి సోమవారం రాత్రి బంధువులకు అప్పగించారు. గాయాలపాలైనవారిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
జతిన్, నవీన్, నవీన్కుమార్, అజయ్ (పాత చిత్రాలు)
నలుగురికి తీవ్రగాయాలు: పాశర్లపూడికి చెందిన మల్లవరపు వినయ్బాబు, మర్లపూడి లోకేశ్, పెదపట్నంలంకకు చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి, నగరానికి చెందిన మాదాసి ప్రశాంత్కుమార్లకు తలపై తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు మద్యం తాగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై శేఖర్బాబు తెలిపారు.
పుట్టిన రోజు చేసుకోకుండానే...
మామిడికుదురు మండలం నగరంలోని కొల్లాబత్తుల జతిన్ (హ్యాపీ) సోమవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆదివారం తాటిపాకలో దుస్తులు కొనుగోలుచేసి స్నేహితులతో కలిసి ఆటోలో యానాం వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజుకు ఏర్పాట్లు చేసుకున్న అతన్ని మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు దుఃఖసంద్రంలో మునిగారు. ఆరేళ్ల క్రితం పెళ్లయిన జతిన్కు భార్య ఆశాదేవి, అయిదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కుమారుడు ఉన్నారు. ఎలక్ట్రీషియన్గా ఉపాధి పొందుతూ అందరితో కలివిడిగా ఉండే జతిన్ దూరమవడంతో కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోతున్నారు.
అందివస్తాడనుకుంటే..
అందరితో కలివిడిగా ఉండే నగరంలోని కోటమెరకకు చెందిన నవీన్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు. అందివచ్చిన కొడుకు అందనంత దూరం వెళ్లిపోతాడని ఊహించలేదని తాపీపని చేసుకునే తండ్రి శ్రీనివాస్, అమ్మమ్మ మేరీరత్నం విలపించారు. ఉపాధి రీత్యా కువైట్లో ఉంటున్న మృతుని తల్లి రత్నకుమారికి కొడుకు లేడన్న విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులంతా మదనపడుతున్నారు.
ఆటోతో ఉపాధి.. నాలుగైదు నెలల క్రితం ఆటో కొనుక్కుని ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న పాశర్లపూడికి చెందిన నవీన్కుమార్ మృతితో కుటుంబ సభ్యులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అదే ఆటోలో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తూ మృత్యువాతపడడంతో విషాదం అలముకుంది. తండ్రి ఏడుకొండలు, కుటుంబ సభ్యుల రోదనలతో ఇల్లు మారుమోగింది. మస్కట్లో ఉంటున్న తల్లి మంగాదేవికి కొడుకు లేడనే విషయాన్ని చెప్పగా ఆమె అక్కడ స్పృహ కోల్పోయారు.
స్నేహితుడి ఇంటికి వెళ్లివస్తానని చెప్పి..
వల్లూరి అజయ్ తండ్రి శ్రీనివాసరావు ఉపాధినిమిత్తం మూడు నెలల క్రితం గల్ఫ్ వెళ్లారు. తల్లి కుమారి, సోదరుడు ఇక్కడే ఉంటున్నారు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అజయ్ ఆదివారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను.. ఉదయం వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM