logo

ట్రస్టు సేవలు ప్రశంసనీయం

నిజాంపట్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు తుపాను ఛారిటబుల్‌ ట్రస్టుగా ఏర్పడి పేదలకు సేవాకార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని వైకాపా నేత మోపిదేవి హరనాథబాబు పేర్కొన్నారు. దివ్యాంగులైన విద్యార్థులకు ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.

Published : 07 Dec 2021 05:32 IST


దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ చేస్తున్న హరనాథబాబు, ట్రస్టు ప్రతినిధులు

నిజాంపట్నం, న్యూస్‌టుడే : నిజాంపట్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు తుపాను ఛారిటబుల్‌ ట్రస్టుగా ఏర్పడి పేదలకు సేవాకార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని వైకాపా నేత మోపిదేవి హరనాథబాబు పేర్కొన్నారు. దివ్యాంగులైన విద్యార్థులకు ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు ఛైర్మన్‌ గొరికపూడి రాజగోపాలరావు మాట్లాడుతూ.. తాము, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కలిసి చదువుకున్నామని, ట్రస్టు ద్వారా చేసే సేవా కార్యక్రమాల్లో ఎంపీ తనవంతు చేయూత అందిస్తున్నారని పేర్కొన్నారు. తమ సేవలను తీరప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మేనేజింగ్‌ ట్రస్టీ లక్ష్మీనరసమ్మ, ట్రెజరర్‌ దబ్బకూటి బసవరాజు, ట్రస్టీలు తాడికొండ నరసింహారావు, బాలబ్రాహ్మేంద్రరెడ్డి, సభ్యులు గోవిందరెడ్డి, గుల్జార్, రామానుజమ్మ, నాళం సాయిబాబు, వెంకటరమణ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని